గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 905 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 2,168 మందితో ప్రొవిజినల్ లిస్టును వెల్లడించింది. అందులో 370 మంది స్పెషల్ కేటగిరి అభ్యర్థులున్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారు.
ఇదీ చదవండి:TGPSC గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్కు లైన్ క్లియర్... ఈ పిటిషన్ కొట్టివేత
గ్రూప్–2పై కోర్టులో కేసులున్నా ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.
No comments:
Post a Comment