AP RGUKT 2021: ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, ఒంగోలు: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్–2021 ఫలితాలు అక్టోబర్ 6న విడుదలయ్యాయి. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్)లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆర్జీయూకేటీ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
No comments:
Post a Comment