మే 17న వ‌ర‌ల్డ్ హైప‌ర్ టెన్ష‌న్ డే (ప్ర‌పంచ ర‌క్త‌పోటు దినోత్స‌వం)

మే 17న వ‌ర‌ల్డ్ హైప‌ర్ టెన్ష‌న్ డే (ప్ర‌పంచ ర‌క్త‌పోటు దినోత్స‌వం)


ప్ర‌తి ఏడాది మే 17న వ‌ర‌ల్డ్ హైప‌ర్ టెన్ష‌న్ డే (ప్ర‌పంచ ర‌క్త‌పోటు దినోత్స‌వం)ని జ‌రుపుకుంటారు.

గ‌తేడాది థీమ్ “ప్ర‌తి ఒక్క‌రు త‌మ బీపీ లెవ‌ల్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోండి”. ప్ర‌జ‌ల అంద‌రికి ‘హైప‌ర్ టెన్ష‌న్’ పై స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.
World Hypertension Day


హైప‌ర్ టెన్ష‌న్ (ర‌క్త‌పోటు) అంటే:

మన గుండె పని చెయ్యాలి కాని ప్రయాస పడుతూ పని చెయ్యకూడదు. రక్త పోటు అనేది గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నాదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం రక్తనాళల గోడల మీద ఒత్తిడి పెడుతోంది. ఈ ఒత్తిడి గుండెకి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతూన్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళా గుండె చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. వైద్యులు 'రక్తపు పోటు' అన్నప్పుడు ధమనులలో ఉన్న పీడనాన్ని కొలుస్తారు. . శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు కనుక సాధారణంగా జబ్బ మీద కొలుస్తారు. ఈ పోటు వేళని బట్టి, అప్పటి వరకు పడ్డ ప్రయాసని బట్టి, మనస్సులో ఉండే ఆరాటాన్ని బట్టీ, వేసుకుంటూన్న మందులని బట్టీ కూడా మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె దబదబ కొట్టుకుని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుంది. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటుతో బాధ పడుతూన్నట్లు అర్థం. సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువ ఉంద‌ని నిర్ణయిస్తారు.



రక్త పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారు. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌పోటు, రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌పోటు. గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. అది సిస్టాలిక్‌పోటు. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని పాదరస స్తంభం పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంభం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.


ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాల‌కి అధిక రక్తపోటు ప్రధాన కారణం. అధిక రక్తపోటును "నిశ్శబ్ద కిల్లర్" అని పిలుస్తారు, స్పష్టమైన లక్షణాలు లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఉప్పు (సోడియం) తినడం, అధిక బరువు ఉండటం మరియు తగినంత వ్యాయామం చేయకపోవడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.





లక్ష్యాలు:

• రక్తపోటు లక్షణాల గురించి అవగాహన పెంచడం.

• ప్ర‌జ‌లంద‌రూ రక్తపోటును ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుడు వ‌ద్ద చెక‌ప్ చేయించుకోవ‌డం

• అధిక రక్తపోటుకి సంబంధించిన ముందస్తు నివారణ పద్ధతులను తెలుసుకోవడం.

No comments:

Post a Comment