Current Affairs in Telugu 1st and 2nd March 2020



రాష్ట్రీయం 

అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం
  • ఫిబ్రవరి 29న సుమారు పద్దెనిమిది సంత్సరాలు గా బాంబులు, తుపాకుల దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొల్పడానికి. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
  • ఖతర్‌లోని దోహాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్ల బారాదార్ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 
  • ఈ కార్యక్రమానికిఖతార్‌లో భారత రాయబారి పి కుమారన్‌తో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 
  • ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు. 
  • మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి.
  • తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది.
  • అయితేఈ ఒప్పందం అమలుకావాలంటే తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య ఈ నెల 10నఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు సఫలం కావాలి.
ప్రపంచంలో తొలి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థ
  • ప్రపంచంలో తొలి సారిగా కాలుష్యాన్ని,వాహనాల రద్దీ తగ్గించడానికి ఐరోపా దేశము లక్సెంబర్గ్ ప్రజలందరికి ఉచిత ప్రయాణాన్ని అందించింది.
  • రైళ్లు,బస్సు ఎలాంటి టికెట్టు అవసరం లేకుండా ప్రయాణించే పద్దతిని ప్రారంభించింది. లక్సెంబర్గ్ కారుల వినియోగం అధికం.
  • ప్రతి 1000 మందిలో 662 మందికి కార్లు గలవు.
  • ట్రాఫిక్ సమస్య తగ్గింపు,బస్సులు,రైల్ లలో ప్రయాణించడాన్నిప్రోత్సహించడానికి ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినది.

No comments:

Post a Comment