AP History Questions in Telugu Part-4



1. కాకతీయుల కాలంలో గ్రామపాలనను ఎంత మంది ఆయగార్లు నిర్వహించేవారు ?
1) 8
2) 10
3) 12
4) 18

2. జతపరచండి.
జాబితా -I
1) ప్రాడ్వివాక్కులు
2) జయ పత్రాలు
3) లెంకలు
4) నగరశ్రీకావలి
జాబితా - II
a) అంతఃపుర రక్షకుడు
b) న్యాయాధికారులు
c) న్యాయ తీర్పులు
d) రాజు సొంత అంగరక్షకులు
1) 1---b,2-c-,3--d,4--a
2) 1---a,2-d-,3--c,4--b
3) 1---c,2--b,3--a,4--d
4) 1---d,2-a-,3--b,4--c

3. బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్థంభాన్ని ఎత్తినట్టు చెబుతున్న గ్రంథం ?
1) పల్నాటిచరిత్ర
2) క్రీడాభిరామం
3) పండితారాధ్యచరిత్ర
4) హరివంశం


4. బడేమాలిక్ (దొడ్డ ప్రభువు) అనే బిరుదు పొందిన గోల్కొండ నవాబు ?
1) జంషీద్
2) సుల్తాన్‌కులీ
3) మహ్మద్‌కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లాకుతుబ్‌షా

5. కింది వాటిలో సరైనది ?
1) తళ్ళికోట యుద్ధం - క్రీ.శ. 1565
2) శ్రీకృష్ణదేవరాయలు సింహసనం అధిష్ఠించుట - క్రీ.శ. 1509
3) గోల్కొండ మొగలుల సామంతరాజ్యమైంది- క్రీ.శ. 1636
4) పైవన్నీ

6.క్రీ.శ. 1670లో గోవా క్రైస్తవుల కోసం ఒక చర్చిని గోల్కొండ నవాబుల కాలంలో ఎక్కడ నిర్మించారు ?
1) మచిలీపట్నం
2) నరసాపురం
3) చంద్రగిరి
4) బొబ్బిలి

7. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సమాధి ఎక్కడ ఉంది ?
1) బనగానపల్లి
2) కందిమల్లయపల్లె
3) పుష్పగిరి
4) నంద్యాల

8. ‘బాలభాగవతం’ గ్రంథకర్త ?
1) శ్రీనాథుడు
2) ఏకామ్రనాథుడు
3) కోనేరునాథుడు
4) మానప

9. చంద్రగిరికోట (చిత్తూరు)లోని భవనాలపై, కప్పులపై ఉన్న కళాకృతుల శైలిని ఏమంటారు ?
1) స్టక్కో
2) రెమో
3) పెంట
4) హథా

10. వాస్కోడిగామా కాలికట్‌లో అడుగుపెట్టే నాటికి విజయనగర సామ్రాజ్య పాలకుడెవరు ?
1) వీరనరసింహరాయలు
2) సాళ్వనరసింహరాయలు
3) ఇమ్మడి నరసింహరాయలు
4) సదాశివరాయలు

11. క్రీ.శ.1325 సంవత్సరంలో స్వతంత్ర రెడ్డిరాజ్యాన్ని స్థాపించిందెవరు ?
1) అనవేమారెడ్డి
2) అనవోతారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) కుమారగిరిరెడ్డి

12. జతపరచండి.
జాబితా - I
1) మ్లేచ్ఛాబ్థి కుంబోద్భవ
2) ద్వీప విజేత
3) దివిదుర్గవిభాళ
4) సర్వజ్ఞ చక్రవర్తి
జాబితా - II
a) పెదకోమటి వేమారెడ్డి
b) అనవేమారెడ్డి
c) అనవోతారెడ్డి
d) ప్రోలయవేమారెడ్డి
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-a,3-d,4-b
3) 1-d,2-c-,3-b,4-a
4) 1-a,2-b-,3-c,4-d

13.రెడ్డిరాజుల కులదేవత ఎవరు ?
1) మూలగూరమ్మ
2) నూకాలమ్మ
3) మాణిక్యాంబ
4) పోలేరమ్మ

14. ‘సంతానసాగరం చెరువును’ తవ్వించిందెవరు ?
1) మలయవతి
2) లకుమాదేవి
3) సూరాంభిక
4) అనితల్లి

15. కింది వాటిలో సరైనది ?
1) కేసరిపాటిగడ - భూమి కొలత సాధనం
2) భృగుపాతం - శ్రీశైలం శిఖరం నుంచి దూకి మరణించుట
3) కైఫియత్‌లు - గ్రామ చరిత్ర రికార్డులు
4) పైవన్నీ

16. శ్రీకాళహస్తిలో పాతాళగణపతి ఆలయాన్ని నిర్మించిందెవరు ?
1) అవచి తిప్పయ్యశెట్టి
2) ముమ్మడి శాంతయ్య
3) బెండపూడి అన్నయామాత్యుడు
4) మామిడి సింగన

17.రాచవేమారెడ్డి విధించిన వివాదాస్పదమైన పన్ను ?
1) కిరళము
2) దొగరాజ పన్ను
3) మగము
4) పురిటి సుంకం

18. ప్రోలయవేమారెడ్డిని ‘మ్టేచ్ఛాబ్థి కుంబోద్భవ’ అని సంబోధిస్తున్న శాసనం ?
1) మాంచెళ్ళ తామ్రశాసనం
2) త్రిపురాంతకం శాసనం
3) మల్లవరం శాసనం
4) ద్రాక్షారామం శాసనం

19. జతపరచండి.
కవి
1) శివలెంకకొమ్మన
2) ఎర్రాప్రగడ
3) శ్రీనాథుడు
4) కుమారగిరిరెడ్డి
గ్రంథం
a) కాశీఖండం
b) వసంతరాజీయము
c) శివలీలావిలాసం
d) హరివంశం
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-d,3-a,4-b
3) 1-d,2-c,3-b,4-a
4) 1-b,2-a,3-c,4-d

20. అనవేమారెడ్డి వీరశిరోమండపాన్ని ఎక్కడ నిర్మించాడు ?
1) శ్రీశైలం
2) అహోబిలం
3) గుడిమల్లం
4) శ్రీకాళహస్తి

21. అమీనాబాద్ శాసనం ప్రకారం ‘జగనొబ్బదండకాలువ’ ను తవ్వించింది ఎవరు ?
1) రాచవేమారెడ్డి
2) కాటయవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరిరెడ్డి

22. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది ?
1) కందుకూరు
2) కొండపల్లి
3) అద్దంకి
4) కనిగిరి

23. ‘అరెకుడు’ అంటే ఎవరు ?
1) న్యాయాధికారి
2) తలారి
3) శిస్తువసూలు అధికారి
4) కౌలుదారుడు

24. కాగితాన్ని గురించి పేర్కొన్న తొలి తెలుగుకవి ?
1) విన్నకోట పెద్దన
2) తిక్కన
3) గౌరన
4) శ్రీనాథుడు

25. పెదకోమటి వేమారెడ్డి పాలనాకాలం ఏది ?
1) క్రీ.శ.1402 - 1420
2) క్రీ.శ.1410 - 1430
3) క్రీ.శ.1400 - 1410
4) క్రీ.శ.1420 - 1430

26. జతపరచండి.
జాబితా - I
1) అల్లసానిపెద్దన
2) భట్టుమూర్తి
3) తెనాలి రామకృష్ణుడు
4) నంది తిమ్మన
జాబితా - II
a) వసుచరిత్ర
b) పాండురంగమహత్యం
c) పారిజాతాపహరణ
d) మనుచరిత్ర
1) 1-d,2-a,3-b,4-c
2) 1-a,2-b,3-c,4-d
3) 1-d,2-c,3-b,4-a
4) 1-c,2-d,3-a,4-b

27. విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన నికోలోకోంటి ఏ దేశస్థుడు ?
1) ఇటలీ
2) పర్షియా
3) ఈజిప్ట్
4) జర్మనీ

28. ‘విజయనగరంలాంటి నగరాన్ని కనులతో చూడలేదు, చెవులతో వినలేదు’ అని దాని వైభవాన్ని కీర్తించినవారు ?
1) అబ్దుల్జ్రాక్
2) నికోలోకోంటి
3) న్యూనిజ్
4) డొమింగోఫేస్

29. జతపరచండి.
పదం
1) నీరాంబరము
2) థంబోళి
3) చావడి
4) కాడాంబరము
అర్థం
a) మాగాణిసేద్యం
b) శత్రువులపై రాళ్ళు రువ్వేసాధనం
c) మెట్టసేద్యం
d) గ్రామ కరణాల కార్యస్థానం
1) 1-d,2-a,3-c,4-b
2) 1-a,2-b,3-d,4-c
3) 1-b,2-c,3-a,4-d
4) 1-c,2-d,3-b,4-a

30. విజయనగర రాజులకాలంలో ‘చంద్రశాలలు’ అంటే ?
1) ఉన్నత కుటుంబాల గృహాలలో మధుపానసేవన గదులు
2) ఉన్నత కుటుంబాల గృహాలలో చిత్రశాలలు
3) ఉన్నత కుటుంబాల గృహాలలో పనివారి గదులు
4) పేవరారి గృహాలలో వంటచేసుకునే స్థలాలు

31. జైన, వైష్ణవులకు క్రీ.శ.1368లో వివాదం వచ్చినప్పుడు దానిని పరిష్కరించిన విజయనగరరాజు ఎవరు ?
1) ప్రౌఢదేవరాయలు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) అచ్యుతదేవరాయలు

32. జతపరచండి.
రాజు
1) అళియరామరాయలు
2) మొదటి విరూపాక్షరాయలు
3) సాళ్వ నరసింహరాయలు
4) శ్రీకృష్ణదేవరాయలు
ప్రాధాన్యత
a) పొట్నూరులో విజయ స్థంభం నాటించాడు
b) అన్నమాచార్యులను ఆదరించాడు
c) సంగమవంశంలో వైష్ణవాన్ని అనుసరించిన తొలిరాజు
d) తురకవాడలో గోవధకు అనుమతిచ్చెను
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-a,3-d,4-b
3) 1-a,2-b,3-c,4-d
4) 1-d,2-c,3-b,4-a

33. ‘మాలదాసరికథ’ ఏ గ్రంథంలో ఉంది ?
1) జాంబవతీపరిణయం
2) మదాలసచరిత్ర
3) ఆముక్తమాల్యద
4) పాండురంగమహత్యం

34. కింది వాటిలో సరైనది ?
1) పేరంటాళ్ళు - సతీసహగమనం చేసిన స్త్రీలను గ్రామదేవతలవలె పూజించే ఆచారం
2) వడగలై - వేదాంతదేశికుడు ఆంధ్రలో స్థాపించిన వైష్ణవ మత శాఖ
3) హెర్జుంకం - టోకు వర్తకులు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే సుంకం
4) పైవన్నీ

35. సాళువ మంగుకు కుమార కంపన అమరమాగాణంగా ఇచ్చిన ప్రాంతం ?
1) పెరుమాళ్ళపల్లి
2) నారాయణవనం
3) ఏర్పేడు
4) గంగాథర నెల్లూరు

36. గోల్కొండ సుల్తానుల కాలంలో ఆయకట్టు భూములకు నీరు పెట్టేవారిని ఏమంటారు ?
1) వడ్డెర
2) ఐనుల్‌ముల్క్
3) మజుందార్
4) కొత్వాల్

37. జతపరచండి.
జాబితా -I
1) అద్దంకి గంగాధరకవి
2) కందుకూరి రుద్రకవి
3) పొన్నెగంటి తెలగనార్య
4) మరిగంటి సింగనార్యుడు
జాబితా -II
a) నిరంకుశోపాఖ్యానం
b) యయాతి చరిత్ర
c) దశరధరాజనందన చరిత్ర
d) తపతీ సంవర్ణోపాఖ్యానం
1) 1-b,2-c,3-d,4-a
2) 1-d,2-a,3-b,4-c
3) 1-a,2-b,3-c,4-d
4) 1-b,2-d,3-a,4-c

38.‘రెండవ ఈజిప్ట్’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ?
1) గోల్కొండ
2) మోటుపల్లి
3) వజ్రకరూర్
4) పరిటాల

39. శిస్తు వసూలు హక్కు కొన్నవారిని గోల్కొండ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు ?
1) మహత్‌సిబ్‌లు
2) సుతార్‌లు
3) షరియత్‌పంచ్‌లు
4) ముస్తజీర్‌లు

40.భక్తరామదాసును ఖైదుచేయించిన గోల్కొండ నవాబు ?
1) అబ్దుల్లాకుతుబ్‌షా
2) అబుల్‌హసన్ తానీషా
3) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
4) మహ్మద్ కులీ కుతుబ్‌షా

41. గోల్కొండరాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు ?
1) క్రీ.శ.1685
2) క్రీ.శ.1686
3) క్రీ.శ.1687
4) క్రీ.శ.1689

ANSWERS:
1)3 2)1 3)1 4)2 5)4 6)1 7)2 8)3 9)1 10)3 11)3 12)3 13)1 14)3 15)4 16)1 17)4 18)3 19)2 20)1 21)1 22)3 23)2 24)4 25)1 26)1 27)1 28)1 29)2 30)1 31)3 32)4 33)3 34)4 35)2 36)1 37)2 38)1 39)4 40)2 41)3
AP History Questions in Telugu Part-3

No comments:

Post a Comment