Indian Polity Questions in Telugu Part-4

Indian Polity Questions in Telugu Part-4


భారత సమాఖ్య వ్యవస్థ :
1. భారత రాజ్యాంగంలో ‘సమాఖ్య’ అనే పదం ఎక్కడ ఉంది?

1) ఆర్టికల్‌–1
2) మొదటి షెడ్యూల్‌
3) మొదటి భాగం
4) ఎక్కడా లేదు


2. భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది?
1) అమెరికా
2) స్విట్జర్లాండ్‌
3) కెనడా
4) ఆస్ట్రేలియా


3. భారత సమాఖ్య వ్యవస్థను ‘సహకార సమాఖ్య’ గా వ్యాఖ్యానించింది?
1) కె.సి.వేర్‌
2) గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
3) మారిస్‌ జోన్స్‌
4) పాల్‌ ఆపిల్‌ బీ




4. కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది?
1) ద్విసభ విధానం
2) అఖిల భారత సర్వీస్‌లు
3) అవశిష్ట అధికారాలు
4) ఏకీకృత న్యాయవ్యవస్థ



5. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో అధికార విభజన గురించి ఉంది?
1) 6
2) 7
3) 8 
4) 9


6. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు?
1) శాసన సంబంధాలు
2) పరిపాలక సంబం«ధాలు
3) ఆర్థిక సంబంధాలు
4) న్యాయ సంబంధాలు


7. అవశిష్ట అధికారాలపై శాసనాలు నిర్మించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) భారత పార్లమెంట్‌
2) రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ
3) స్థానిక ప్రభుత్వాలకు
4) 1, 2 సరైనవి


8. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు?
1) 252
2) 254
3) 262
4) 264


9. అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1950
2) 1956
3) 1990
4) 1996



10. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైంది ఏది?
1) నీతి ఆయోగ్‌
2) మండల సంఘాలు
3) ఆర్థిక సంఘం
4) పైవన్నీ



11. భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి/ఖాతా పేరేమిటి? 
1) భారత సంఘటిత నిధి
2) భారత ఆగంతుక నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పైవేవీ కావు



12. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?
1) కె.హనుమంతయ్య
2) మొరార్జీ దేశాయ్‌
3) పి.వి. రాజమన్నార్‌
4) ఎమ్‌.సి. సెతల్వాడ్‌



13.రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై 1977లో కేంద్రానికీ మెమోరాండం సమర్పించిన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్‌
2) కేరళ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర


14. కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఆర్‌.ఎస్‌. సర్కారియా కమిషన్‌ను నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు?
1) మొరార్జీ దేశాయ్‌
2) చరణ్‌ సింగ్‌
3) ఇందిరా గాంధీ
4) రాజీవ్‌ గాంధీ



15. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనంద్‌పూర్‌ సాహెబ్‌ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ?
1) పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ
2) అకాలీదళ్‌ పార్టీ
3) నేషనల్‌ కాన్ఫరెన్స్‌
4) లోక్‌మంచ్‌



16. కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఎం.ఎం.పూంచి కమిషన్‌ను ఏ ప్రభుత్వం నియమించింది?
1) ఎన్‌డీఏ ప్రభుత్వం
2) నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం
3) యూపీఏ ప్రభుత్వం
4) యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం


17. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తున్న ఆర్టికల్స్‌? 
1) 245, 246, 247, 248
2) 249, 250, 252, 253
3) 256, 257, 258, 259
4) 260, 261, 262, 263


ANSWERS:

1)4 2)3 3)2 4)1 5)2 6)4 7)1 8)3 9)3 10)3 11)2 12)2 13)1 14)3 15)2 16)3 17)2

No comments:

Post a Comment