Indian Polity Questions in Telugu Part-2

Indian Polity Questions in Telugu


1. భారత ప్రధానమంత్రి రాజ్యాంగం ప్రకారం...
1) నియమించబడతాడు
2) ప్రత్యక్షంగా ఎన్నిక అవుతాడు
3) పరోక్షంగా ఎన్నిక అవుతాడు
4) అధిష్టానం నియమిస్తుంది


2. రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి?
1. లాల్ బహదూర్ శాస్త్రి
2. ఇందిరా గాంధీ
3. చరణ్ సింగ్
4. దేవేగౌడ


3. కేంద్రంలో ప్రధానమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉండవచ్చు?
1. పార్లమెంట్ సభ్యుల్లో 10% మంది
2. లోక్‌సభ సభ్యుల్లో 10% మంది
3. పార్లమెంట్ సభ్యుల్లో 15% మంది
4. లోక్‌సభ సభ్యుల్లో 15% మంది


4. భారత ప్రధానమంత్రి కింది ఏ పద్ధతుల్లో పదవీచ్యుతుడు అయ్యే అవకాశం ఉంటుంది?
1) అవిశ్వాస తీర్మానం
2) విశ్వాస తీర్మానం
3) దన్యవాద తీర్మానం
4) పైవన్నీ



5. భారత ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్‌లో అడుగుపెట్టని భారత ప్రధానమంత్రి ఎవరు?
1) వి.పి. సింగ్
2) చంద్రశేఖర్
3) చరణ్ సింగ్
4) మొరార్జీ దేశాయ్


6. కేంద్ర మంత్రిమండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1) రాష్ర్టపతి
2) పార్లమెంట్
3) లోక్‌సభ
4) సుప్రీంకోర్టు


7. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ....
1) సమానులే
2) కేబినేట్ మంత్రులు ఉన్నతులు
3) మంత్రులు మూడు రకాలు
4) పైవన్నీ సరైనవి


8. రెండు సార్లు భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి?
1) వల్లభబాయ్ పటేల్
2) చరణ్ సింగ్
3) దేవీలాల్
4) వై.బి. చవాన్


9. 1989లో భారతదేశ 7వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన వి. పి. సింగ్ ఏ కూటమికి నాయకత్వం వహించాడు?
1) యునెటైడ్ ఫ్రంట్ (UF)
2) నేషనల్ ఫ్రంట్ (NF)
3) నేషనల్ డెమొక్రటిక్ అలయెన్‌‌స (NDA)
4) యునెటైడ్ ప్రొగ్రెసివ్ అలయెన్‌‌స (UPA)


10. 1966లో భారత పాకిస్తాన్‌ల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందం ఏమిటి?
1) సిమ్లా ఒప్పందం
2) తాష్కెంట్ ఒప్పందం
3) పంచశీల ఒప్పందం
4) లాహోర్ ఒప్పందం


11. కింది వాటిలో సరికానిది ఏది?
1) విదేశాంగ విధాన రూపకర్త - నెహ్రూ
2) సంక్షేమ పథకాలకు ఆద్యుడు - లాల్ బహదూర్ శాస్త్రి
3) సమాచార సాంకేతిక విప్లవానికి ఆద్యుడు -రాజీవ్ గాంధీ
4) ఆర్థిక సంస్కరణల పితామహుడు - పీవీ నరసింహారావు


12. ఆర్టికల్-352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విధించారు?
1) ఒకసారి
2) రెండు సార్లు
3) మూడు సార్లు
4) విధించలేదు


13. రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
1) గుల్జారిలాల్ నందా
2) హిదయతుల్లా
3) చరణ్ సింగ్
4) ఐ.కె. గుజ్రాల్


14. వెనుకబడిన వారి స్థితిగతులను పరిశీలించి తగిన సూచనలు చేయటానికి మండల్ కమిషన్‌ను నియమించిన ప్రధానమంత్రి?
1) ఇందిరా గాంధీ
2) మొరార్జీ దేశాయ్
3) వి.పి. సింగ్
4) పీవీ నరసింహారావు


15. భారత్ పోఖ్రాన్‌లో అణు పరీక్షలకు ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు నిర్వహించింది?
1) జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ
2) లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ
3) ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్
4) ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పాయ్


16. విశ్వాస తీర్మానంలో ఒకే ఒక ఓటుతో లోక్‌సభలో ఓడిపోయి పదవిని కోల్పోయిన భారత ప్రధానమంత్రి ఎవరు?
1) వి.పి. సింగ్
2) హెచ్.డి. దేవేగౌడ
3) ఐ.కె. గుజ్రాల్
4) అటల్ బిహరీ వాజ్‌పాయ్




ANSWERS:
1)1  2)2   3)4   4)4   5)3  6)3  7)1  8)3  9)2  10)2  11)2 12)2  13)1  14)2  15)4  16)4

Indian Polity Questions in Telugu Part-3

Indian Polity MCQs in Telugu- Part-I


No comments:

Post a Comment