Indian History Questions in Telugu Part-8

Indian History Questions in Telugu Part-8


1. కింది వారిలో ఎవరు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు?
1) మదన్ మోహన్ మాలవ్యా
2) డా. బి. ఆర్. అంబేడ్కర్
3) మహ్మద్ ఇక్బాల్
4) సి.వై. చింతామణి


2. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని వారెవరు?
1) మహాత్మా గాంధీ
2) జి.డి. బిర్లా
3) అలీ ఇమామ్
4) అబ్బాస్ త్యాబ్జీ


3. కింది వాటిలో సరైంది ఏది?
1) మొత్తం 46 మంది ప్రతినిధులు 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు
2) మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 5వ జార్జి ప్రారంభించారు
3) ఇర్విన్‌తో జరిపిన చర్చల వల్ల గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు
4) పైవన్నీ


4. ఇంగ్లండ్‌కు చెందిన వివిధ పార్టీల వారు మొత్తం ఎంత మంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు?
1) 16
2) 18
3) 20
4) 22


5.కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) 1932 మార్చి 5న గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది
2) 57 మంది భారత ప్రతినిధులు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు
3) ఇర్విన్ తర్వాత భారత్ వచ్చిన వైశ్రాయ్ లార్‌‌డ వెల్లింగ్టన్
4) ఏదీ కాదు



6. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1930 నవంబర్ 12
2) 1930 డిసెంబర్ 12
3) 1930 నవంబర్ 21
4) 1930 డిసెంబర్ 21


7. కింది వారిలో కమ్యూనల్ అవార్డు వ్యతిరేకించిన వారు ఎవరు?
1) డా. బి.ఆర్. అంబేడ్కర్
2) రామ్సే మాక్ డోనాల్డ్
3) కుసుమ ధర్మన్న
4) భాగ్యారెడ్డి వర్మ


8.మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లండ్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఏది?
1) లిబరల్ పార్టీ
2) డెమోక్రటిక్ పార్టీ
3) కన్జర్వేటివ్ పార్టీ
4) లేబర్ పార్టీ


9. కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు?
1) ఎర్రవాడ
2) వార్థా
3) అహ్మదాబాద్
4) ఢిల్లీ



10. రెండో రౌండ్ టేబుల్ సమావేశాల కాలంలో ఇంగ్లండ్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఏది?
1) లేబర్ పార్టీ
2) కన్జర్వేటివ్ పార్టీ
3) కో-ఆపరేటివ్ పార్టీ
4) లిబరల్ పార్టీ




11.మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించిందెవరు?
1) రామ్సే మాక్ డోనాల్డ్
2) జార్జి -V
3) జార్జి- VI
4) ఎలిజబెత్ -II


12. గాంధీ - అంబేడ్కర్‌ల మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1932 సెప్టెంబర్ 24
2) 1932 అక్టోబర్ 2
3) 1932 ఆగస్ట్ 16
4) 1932 నవంబర్ 19


13. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీకి సహకరించడానికి వ్యక్తిగత హోదాలో హాజరైన మహిళ ఎవరు?
1) దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
2) యామినీ పూర్ణ తిలకం
3) సరోజిని నాయుడు
4) పద్మజా నాయుడు


14. అఖిల భారత ఖైదీల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) జనవరి 2
2) జనవరి 3
3) జనవరి 4
4) జనవరి 5


15. 3వ రౌండ్ టేబుల్ సమావేశ ఫలితంగా ఏర్పడిన చ ట్టం ఏది?
1) భారత స్వాతంత్య్ర చట్టం 1947
2) రౌలత్ చ ట్టం
3) వితంతు పునర్వివాహ చట్టం
4) 1935 భారత ప్రభుత్వ చట్ట

ANSWERS:

1)2 2)4 3)4 4)1 5)1 6)1 7)3 8)4 9)1 10)2 11)2 12)1 13)3 14)3 15)4

No comments:

Post a Comment