Current Affairs in Telugu 26th and 27th February, 2020



రాష్ట్రీయం

రష్యాటెన్నిస్ క్రీడాకారిణి షరపోవా రిటైర్ మెంట్
  • ఐదుసార్లు గ్రాండ్ స్లాం సాధించిన టెన్నిస్ రష్యాక్రీడాకారిణి,ఒకప్పుడు ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన షరపోవా రిటైర్ మెంట్ నుప్రకటించింది.
  • 2001లో డబ్ల్యూటీఏ టూర్‌తో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా, 2005 ఆగస్టులో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించినది.
  • 18 ఏళ్లకే ఈ ఘనత సాధించిన తొలి రష్యన్‌ ప్లేయర్‌గా రికార్డుకెక్కినది.
  • వెటరన్‌ కోచ్‌ యూరీ యుట్‌కిన్‌ వద్ద శిక్షణ తీసుకుంది.
  •  తొలుత స్థానిక రిక్‌ మాకీ అకాడమీలో శిక్షణ తీసుకుంది.
  • 1995లో ప్రముఖ ఐఎంజీ సంస్థ దృష్టిని ఆకర్షించి,ఆ సంస్థ స్పాన్సర్‌షిప్‌తో నిక్‌ బొలెటరీ అకాడమీలో చేరింది.
  • ఆటకు తోడు ఎండార్స్ మెంట్ పరంగాఅత్యధిక ఆదాయాన్ని అందుకున్న క్రీడాకారిణిగా 2005 నుంచి వరుసగా 11 ఏళ్ళు అగ్రస్థానంలో నిలిచింది.
  • ఒక్క 2015లో ఏకంగా రూ. 200 కోట్లు ఆర్జించి రికార్డును సృస్తింది.
  • 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో నిషేధిత ఉత్ప్రేరకము ‘మెల్డోనియం’ను షరపోవా వాడినట్టు నిర్ధారణ అవడం తో ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య ఆమెపై 15 నెలల నిషేధాన్ని విధించింది.
  • షరపోవా గురించిసంక్షిప్తముగా
  • పుట్టినతేదీ:1987 ఏప్రిల్‌ 19న న్యాగన్‌ (రష్యా)
  • ప్రస్తుత నివాసం: ఫ్లోరిడా (అమెరికా)
  • అత్యుత్తమ ర్యాంక్‌: 1 (2005, ఆగస్టు)
  • ప్రస్తుత ర్యాంక్‌: 373
  • కెరీర్‌ సింగిల్స్‌ టైటిళ్లు:35,
  • కెరీర్‌ డబుల్స్‌ టైటిళ్లు: 3
  • గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు: 5
  • వింబుల్డన్‌ (2004)లో సెరెనాను ఓడించింది.
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2008), ,
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2012, 2014),
  • యూఎస్‌ ఓపెన్‌ (2006)
  • లండన్‌ ఒలింపిక్స్‌లో( 2012 )రజత పతకం గెలుచుకుంది.

ట్రంప్ భారత్ పర్యటన విశేషాలు
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2రోజుల పర్యటన(ఫిబ్రవరి 24,25) నిమిత్తం భారత్ కు వచ్చారు.
  • ట్రంప్ తో పాటు సతీమణి మెలనియా,కూతురు ఇవాంక,అల్లుడు జేర్డ్ కుషనర్,బారత్ పర్యటనకు వచ్చారు .
  • తొలుత గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి మోడీ తో కలిసి వెళ్లారు.
  • ఆశ్రమం లో గాంధీ, కస్తూర్బా 1917-1930 లో నివసించిన హృదయ్ కుంజ్ లోకి ట్రంప్ దంపతులను తీసుకెళ్లి చూపించారు.
  • ట్రంప్ దంపతులు చరఖాను తిప్పుతూ నూలు వడకడానికి ప్రయత్నించారు. ఇక్కడ దాదాపు 15 నిముషాలు గడిపారు.
  • చేడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనలను చాటించె మూడు కోతుల బొమ్మలను మోడీ ట్రంప్ దంపతులకు బహుమతిగా ఇచ్చారు.
  • ఆశ్రమం తరుపున కార్తికేయ సారాబాయి ట్రంప్ దంపతులకు మహాత్మ గాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం,చరఖా ,పెన్సిల్,డ్రాయింగ్ లను బహుకరించారు.
  • తరువాత ఆశ్రమం నుంచి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన మోతెరా స్టేడియం వరకు 22కిలోమీటర్లు రోడ్ షో జరిగింది, దేశ భిన్న సంస్కృతిని భిన్న ప్రాంత కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
  • తెల్లని జంప్ షూట్ వేసుకున్న మెలనియాడ్రెస్ డిజైనర్ హెర్వి పియరీ ,ఇవాంక డ్రెస్ ప్రోయోంజా షూలర్ బ్యాండ్ కు చెందినది దీని ధర రూ 1.7 లక్షలు.
  • స్టేడియం ప్రారంభించిన అనంతరం నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని లక్ష మందికి పైగా తిలకించారు. ఈకార్యక్రమం ద్వారా భారత్ కు అమెరికా మిత్రదేశము అని దేశ పౌరులకు అవగహన అయినది.
  • ఇలాంటి కార్యక్రమమే 2019 సెప్టెంబర్ 23 న టెక్సాస్ హ్యూస్టన్ ఎన్ఎస్ జి స్టేడియం లో 50వేల మంది ప్రవాసీ భారతీయులతో హౌడీ మోదీ పేరు తో కార్యక్రమము జరిగినది .
  • నమస్తే ట్రంప్ కార్యక్రమము తరువాత ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించారు
  • మెలనియాఢిల్లీ లోని మోతిబాగ్ లో వున్నా సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్
  • ను సందర్శించారు ఇక్కడ గంటపాటు స్కూలును కలియ తిరిగారు.
  • మట్టితో తాజ్ మహల్ ను శుభ్రం చేసిన మడ్ -ప్యాక్ ట్రీట్ మెంట్ (లైమ్ -రిచ్ క్లే మట్టిని 2మిల్లీ మీటర్ మందం పూసి ఒక రాత్రి ఉంచి ఎండిన తరువాత నీలం బ్రష్ చేత మట్టిని తొలిగిస్తారు తరువాత డిస్టిల్ వాటర్ తో శుభ్రం చేస్తారు )ను విని మెలనియా విస్మయము చెందారు.
  • రాజ్ ఘాట్ లో ట్రంప్ దంపతులు మొక్కను నాటారు.
  • చివరి రోజు ఐన మంగళవారంహైదరాబాద్ హౌస్ లో ట్రంప్,మోడీ సమావేశమయ్యారు 300 కోట్ల డాలర్ల తో అధునాతన ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం జరిగినది.
  • మానసికఆరోగ్యము పైరెండుదేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందము జరిగినది .
  • ట్రంప్ దంపతులకు కేసిఆర్ చార్మినార్ కళాకృతిని అందించారు.

29 బంతుల్లో 10 వికెట్లు తీసిన కెశ్విగౌతమ్
  • మహిళల అండర్‌-19 క్రికెట్‌లో చండీగఢ్‌ కెప్టెన్‌ కెశ్వీ గౌతమ్‌,కేవలం 29 బంతుల్లో 10 వికెట్లు కూల్చి రికార్డ్ సృష్టించింది.
  • బీసీసీఐ అండర్‌-19 మహిళల అంతర్‌ రాష్ట్ర వన్డే క్రికెట్‌ పోటీల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ మ్యాచ్‌లో కెశ్వి అరుదైన ఈ రికార్డ్ ను సృష్టించింది.
  • తొలుత బ్యాటింగ్‌ చేసిన చండీగఢ్‌ కెశ్వీ (49) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్లకు186 పరుగులుచేసింది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌8.5ఓవర్లలో25 పరుగులకే కుప్పకూలింది.
  • కెశ్వి 4.5 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లను పడగొట్టింది. 
  • మహిళల క్రికెట్‌ చరిత్రలో ఏ వయసు విభాగం నుంచైనా వన్డే, టీ20ల్లో ఇలాంటి రికార్డు ఇంతవరకు నమోదు కాలేదు.


ఐక్యు ఎయిర్ విజువల్ సంస్ధ నివేదిక 2019
  • ఐక్యు ఎయిర్ విజువల్ సంస్ధ నివేదిక 2019 ప్రకారం ప్రపంచములో ఎక్కువ వాయు కాలుష్యం వున్న 30 నగరాల్లో భారత్ లోనే 21 వున్నాయి. 
  • ప్రపంచములో అతి ఎక్కువ వాయు కాలుష్యం గలిగిన నగరం లో గాజియాబాద్ (ఉత్తరప్రదేశ్) గలదు.
  • రాజధానుల విభాగంలోప్రథమ స్థానము లో ఢిల్లీ గలదు.
  • చైనా లోని హౌటన్ వాయుకాలుష్యం లో ప్రపంచము లో 2వ స్థానము లో గలదు.
  • భారత్ లో కాలుష్య నగరాలు నోయిడా,గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, భాండ్వాడి, లఖన్పూ, జింద్,ఫరీదాబాద్,బాగ్ పత్ గలవు 


కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు-2019
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను తెలుగు రచయితలు ఫిబ్రవరి 25 న డిల్లీ లో అందుకున్నారు, వారు
      1. బండి నారాయణస్వామి
  • వీరు శప్తభూమి నవలనురాయలసీమ సామజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను వివరించారు.
  • రాయలసీమ కరువు ,ప్రజల సుఖ దుఖఃలను వేరే ప్రాంత ప్రజలకు ఈ నవల ద్వారా వివరించారు. * మీ రాజ్యం మీరేలండి,రెండు కలల దేశము,గద్దలాడా తాండాయి,వీరి ప్రముఖ రచనలు
  • 2 . పెన్నామధుసూదన్
  • సంస్కృతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి అవార్డు లభించినది. 850 శ్లోకాలతో రచించారు.
  • మహారాష్ట్ర సాధువు గులాబ్ రావ్ మహారాజ్ ఆధ్యాత్మికతను వివరించారు. 
  • ప్రస్తుతము నాగపూర్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
  •  కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ రచించిన యాన్ ఎరా అఫ్ డార్క్ నెస్ కు ఇంగ్లీష్ విభాగములో అవార్డు లభించినది.
  • జయ శ్రీ గోస్వామి మహంతి అస్సామీ భాషలో రచించిన చాణక్య చరిత్రకు అవార్డు లభించినది.





సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నూతన కమిషనర్లు

  •  సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు
  •  టీ న్యూస్‌ మాజీ సీఈవో- మైడ నారాయణరెడ్డి, 
  • విద్యార్థి నాయకుడు- గుగులోత్‌ శంకర్‌నాయక్‌
  •  సోషల్‌ వర్కర్లు సయ్యద్‌ ఖలీలుల్లా-న్యాయవాది, 
  • డాక్టర్‌ మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌--న్యాయవాది ఆర్టీఐ కమిషనర్లుగా ప్రమాణస్వీకారం చేశారు.
  • మోజాంజాహీ మార్కెట్‌లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌ రాజాసదారాం.. వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ మృతి
  • ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ (91) ఫిబ్రవరి 25న మరణించారు. 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకుప్రతీకగా అతనిని పేర్కొంటారు.
  •  1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న ముబారక్ అమెరికాకు మంచిమిత్రుడు. ముబారక్ నియంతృత్వము అనుసరిస్తున్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 
  • 18 రోజులపాటు జరిగిన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 900 మంది మరణించారు.
  •  దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది. 
  • 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై
  • న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో ఆ తీర్పును కొట్టివేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.2017 లోజైలు నుంచి విడుదలయ్యారు.


హురూన్ ప్రపంచ ధనవంతుల జాబితా-2020

  • హురూన్ ప్రపంచ ధనవంతుల జాబితా -2020విడుదల చేసిన నివేదిక ప్రకారం
  • ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది బిలియనీర్లు ఉన్నారు. 2019లో కొత్తగా 480 మంది
  • బిలియనీర్లుగా అవతరించారు. 
  • ప్రపంచ బిలియనీర్లజాబితా;
  • 14,000 కోట్ల డాలర్లతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌-- అగ్రస్థానంలో నిలిచారు.
  • 2వ స్థానములో---- బెర్నార్డ్ ఆర్నాల్డ్
  • 3వ స్థానములో----బిల్ గేట్స్
  • 4వ స్థానములో---వారెన్ బఫెట్
  • 5స్థానములో-----మార్క్ జుకర్ బర్గ్ కలరుబిలియనీర్లదేశాల జాబితాలో గలరు. 
  • బిలియనీర్లదేశాల జాబితాలో;
  • 1వ వస్థానము---చైనా -799 మంది బిలియనీర్లు.
  • 2వస్థానము---అమెరికా- 626 మంది బిలియనీర్లు.
  • 3వస్థానము---- భారత్ -138మంది బిలియనీర్లు గలరు 
  • భారత్ నుంచిబిలియనీర్ల జాబితాలో;
  • 1వస్థానము--- రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకే శ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన నికర విలువ 6,700 కోట్ల డాలర్లు. గత ఏడాది ఈయన సంపద గంటకు రూ.7 కోట్లు పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
  • 2వస్థానము-- ఎస్‌పీ హిందుజా కుటుంబం (2,700 కోట్ల డాలర్లు)
  • 3.,వస్థానము--- గౌతమ్‌ అదానీ (1,700 కోట్ల డాలర్లకు పైగా),ప్రపంచములో 68వస్థానము
  • 4.వస్థానము---శివ్‌ నాడార్‌ ఆయన కుటుంబం ( దాదాపు 1,700 కోట్ల డాలర్లు) ప్రపంచములో 68వస్థానము
  • 5వస్థానము ---లక్ష్మీ మిట్టల్‌ (1,500 కోట్ల డాలర్లు)
  • 6.వస్థానము----ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ (దాదాపు 1,500 కోట్ల డాలర్లు)స్వతహాగా బిలియనీర్‌గా మారిన ప్రపంచంలోని ఏకైక బ్యాంకర్‌ ఈయనే కావడం విశేషం.
  • 7వస్థానంలో---- అజీమ్‌ ప్రేమ్‌జీ (1,400 కోట్ల డాలర్లు).
  • 8 స్థానంలో ----సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా 1,200 కోట్ల డాలర్లు సంపద
  • 91వ స్థానం-- --ఉదయ్ కోటక్ 15 బిలియన్ డాలర్ల సంపద.
  • 24 ఏళ్ల వయసున్న ఓయో వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ సంపద 110 కోట్ల డాలర్లుగా ఉంది. దేశంలో అతిపిన్న సంపన్నుడు ఈయనే కావడం విశేషం.
  • ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముంబై తొమ్మిదో అతిపెద్ద సంపన్న నగరంగా నిలిచిం (50 మంది - 21,800 కోట్ల డాలర్ల సంపద).
  • తెలుగు ధనవంతులు;
  • పేరు సంపద కంపెనీ ర్యాంక్‌
  • (కోట్ల డాలర్లు)
  • మురళీ దివి, కుటుంబం 430 దివీస్‌ ల్యాబ్స్‌ 589
  • పీ పిచ్చి రెడ్డి 190 ఎంఈఐఎల్‌ 1,530
  • పీవీ కృష్ణా రెడ్డి 180 ఎంఈఐఎల్‌ 1,607
  • పీవీ రాంప్రసాద్‌ రెడ్డి 180 అరబిందో ఫార్మా 1,607
  • జూపల్లి రామేశ్వర్‌ రావు 140 మై హోమ్‌ 2,000
  • కే సతీష్‌ రెడ్డి 120 డాక్టర్‌ రెడ్డీస్‌ 2,276
  • జీవీ ప్రసాద్‌, జీ అనురాధ 100 డాక్టర్‌ రెడ్డీస్‌ 2,642

No comments:

Post a Comment