Current Affairs in Telugu 30 December 2019.

అంతర్జాతీయం 

 నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ @ 2026
*ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియా వచ్చే ఆరేళ్లలో తన ప్రస్తుత ర్యాంకు ను మరింతగా మెరుగు పరచుకొని దూసుకుపోనుంది. 
*2026 నాటికి మన దేశం ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుంది. 
*ఇందుకోసం యూరోప్ లోని అతి పటిష్టమైన, మెరుగైన ఆర్థికవ్యవస్థగా ఉన్నటువంటి జర్మనీ ని వెనక్కు నెట్టబోతోంది. 
*బ్రిటన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సిఈబిఆర్) అనే ప్రఖ్యాత పరిశోధన సంస్థ ఒక నివేదిక రూపొందించింది. 
*దాని ప్రకారం భారత్ ప్రపంచం దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందువరుసలో ఉండబోతోంది. 
*ఇదే వేగంతో అభివృద్ధి సాధిస్తే 2034 నాటికి భారత దేశం జపాన్ ఆర్థిక వ్యవస్థను కూడా దాటుకొని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా నిలిచే ఆస్కారం ఉందని సిఈబిఆర్ వెల్లడించింది. 
*పటిష్టమైన ఆర్థిక పునాదుల పై నడిచిన ఇండియన్ ఎకానమీ 2019 లో సరికొత్త రికార్డులను సాధించింది. మొట్టమొదటి సారి యూరోప్ లోని బలమైన ఆర్థిక వ్యవస్థలను వెనక్కి నెట్టి మరీ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎకానమీ గా ఆవిర్భవించింది. 
*ఇందుకోసం ఏకంగా యూకే, ఫ్రాన్స్ దేశాలను అధిగమించి నెంబర్ 5 స్థానాన్ని భారత్ సాధించింది. 
*అయితే, అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ నెంబర్ 3 ఎకానమీ స్లాట్ కోసం మాత్రం వచ్చే 15 ఏళ్ళ పాటు జర్మనీ, జపాన్, ఇండియా ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని పరిశోధక సంస్థ అభిప్రాయపడింది. 
*ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు భారత దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించి అవకాశం ఇండియాకు ఉందని సిఈబిఆర్ వెల్లడించింది. 
*ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఉండగా చైనా రెండో స్థానంలో జపాన్ మూడో స్థానంలో కొనాగుతున్నాయి. జర్మనీ నాలుగు, ఇండియా ఐదో స్థానంలో ఉన్నాయి.


ప్రపంచ విజేతగా కోనేరు హంపి
* భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 18 సంవత్సరాల తర్వాత తన కెరియర్ లో అతిపెద్ద విజయం సాధించింది. 
*మాస్కో వేదికగా ముగిసిన 2019 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరింది. 
*12 రౌండ్ల ఈ టోర్నీలో పాల్గొన్న 32 సంవత్సరాల హంపి.ఓ బిడ్డకు తల్లిగా ప్రపంచ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. 
*2001లో ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్ నెగ్గిన కోనేరు హంపి ఆ తర్వాత మరో ప్రపంచ టైటిల్ ఇటీవల సాధించింది. 
* ఆఖరి, 12వ రౌండ్లో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీని అధిగమించిన హంపి మరో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లతో కలసి సమఉజ్జీగా నిలిచింది. ముగ్గురికి పాయింట్లు సమంగా రావడంతో సగటు ఎత్తుల ప్రాతిపదికన హంపిని విజేతగా ప్రకటించారు. 
*ప్రస్తుత సీజన్లో ఫిడే గ్రాండ్ ప్రీ సిరీస్ లు నెగ్గడంతో పాటు ప్రస్తుత ప్రపంచ టైటిల్ తో హంపి 30 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించడం ద్వారా తన ర్యాంక్ ను మూడోస్థానానికి మెరుగు పరచుకోగలిగింది. 
*పురుషుల విభాగంలో మాగ్నుస్ కార్ల్ సన్ 12 రౌండ్లలో 11.5 పాయింట్లు, మహిళల విభాగంలో కోనేరు హంపి 12 రౌండ్లలో 9 పాయింట్లు సాధించడం ద్వారా ప్రపంచ ర్యాపిడ్ విజేతలుగా నిలువగలిగారు. 
*హంపి విజయాలు -- 
*15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా. 
* పదేళ్ల వయస్సులో ప్రపంచ యూత్ చెస్‌లో మూడు స్వర్ణాలతో సంచలనం. 
* జూనియర్ ప్రపంచ ఛాంపియని షిప్‌లో టైటిల్. 
* 2600కు పైగా ఎలో రేటింగ్ సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత. 
* ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం. 
* 1997లో ప్రపంచ యూత్ చెస్‌లో ఒకేసారి అండర్ - 10, 12, 14 విభాగాల్లో స్వర్ణాలు గెలిచారు. 
* అత్యంత పిన్న వయస్సులో (15 ఏళ్ల 67 రోజులు) గ్రాండ్ మాస్టరైన మహిళా క్రీడాకారిణిగా 2002లో రికార్డు నెలకొల్పారు.

జాతీయం 

ఇండియన్‌ ఫారెస్టు సర్వే రిపోర్ట్‌
* ఇండియన్‌ ఫారెస్టు సర్వే రిపోర్ట్‌ను కేంద్ర అటవీ పర్యవరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ డిసెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. 
* ఏపీలో అత్యధికంగా 990 చదరపు కిలోమీటర్ల అడవుల విస్తీర్ణం పెరిగి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 
* గత నాలుగేళ్లలో దేశంలో 13వేల చదరపు కిలోమీటర్ల అడవి పెరిగింది. పారిస్‌ లక్ష్యాలకు అనుగుణంగా విధానాలు ప్రభుత్వం అమలుచేస్తోంది. 
* కంపా పథకం కింద అడవుల పెంపకానికి రూ. 40వేల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం అందించింది. 
* సర్వే నివేదికలో దేశ వ్యాప్తంగా గణనీయంగా అడవుల విస్తీర్ణం పెరిగింది.రెండు సంవత్సరాలలో 5,188 చదరపు కిలోమీటర్ల అడవుల విస్తీర్ణం పెరిగింది. 
*అత్యధికంగా ఏపీ 990 చ.కి.మీ అడవులు విస్తీర్ణం పెరిగి పర్వతాల్లోని అడవుల శాతంలో 0.19 శాతం పెరిగింది. 
*ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల శాతం తగ్గింది. 
* ఒక చెట్టు కట్‌ చేస్తే పది చెట్లు పెంచేలా ప్రణాళిక ఉండాలని ప్రకాశ్ జవదేకర్ సూచించారు. 
* వెదురు బొంగులను గడ్డి జాతిలో వేయడం వల్ల వెదురు ఉత్పత్తులు పెరిగాయి. 
* ఎర్ర చందనం భారత జాతి వృక్షం అయినా, దానిని మనం పెంచకపోవడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 
* ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 
* రాజస్థాన్‌లో జల స్వావలంబన వల్ల అడవుల విస్తీర్ణం పెరిగింది. 



నావికాదళంలో కి మరో 24 జలాంతర్గాములు
*నీటి లోలోతుల్లో పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో 24 జలాంతర్గాములను అమ్ములపొదిలో చేర్చుకోవాలని భారత నౌకాదళం ప్రణాళికలు రచిస్తోంది. 
* కొత్తగా నిర్మించే ఈ జలాంతర్గాముల్లో 6 అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 
*వీటి నిర్మాణంలో దేశంలోని పలు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోనున్నారు. 
*పార్లమెంటరీ కమిటీకి నౌకాదళం దీనికి సంబంధించిన నివేదిక సమర్పించింది. 
*ప్రస్తుతం నావికాదళంలో 15 సంప్రదాయ జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు (ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌, ఐఎన్‌ఎస్‌ చక్ర)ఉన్నాయి. 
*గత 15 సంవత్సరాల్లో కేవలం రెండు జలాంతర్గాములు మాత్రమే నౌకాదళంలోకి వచ్చాయి.అది కూడా సాధారణ విభాగంలోని జలాంతర్గాములు. 
*ఇప్పటికే సేవలందిస్తున్న 13 జలాంతర్గాములు కూడా 17 నుంచి 31 సంవత్సరాల కాలం నాటివి. 
*ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్-75 ఇండియాలో భాగంగా దేశీయ సంస్థల సహకారంతో 6 అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములను, ఇతర దేశాల నౌకా పరికరాల తయారీ సంస్థల సహకారంతో మరో 6 సాధారణ జలాంతర్గాములను కూడా నిర్మించేందుకు నేవీ సిద్ధమవుతోంది. 
*ప్రస్తుతం నేవీలో రష్యాకు చెందిన కిలో క్లాస్, జర్మనీకి చెందిన హెచ్‌డీడబ్ల్యూ క్లాస్, ఫ్రాన్స్‌కు చెందిన స్కార్పియో క్లాస్ జలాంతర్గాములు సాధారణ విభాగంలో సేవలందిస్తుండగా.. అణ్వాయుధ విభాగంలో రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్ఎస్ చక్ర మాత్రమే సేవలందిస్తోంది. 
* అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా బ్యాంకు పూచీకత్తులు సమర్పించలేకపోవడంతో సింధురాజ్‌ జలాంతర్గామి 'మీడియం రీఫిట్‌ లైఫ్‌ సర్టిఫికేషన్‌(ఎంఆర్‌ఎల్‌సీ)'లో జాప్యం జరుగుతుంది.

సీడీఎస్‌ వయోపరిమితి 65 సంవత్సరాలు

*రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్‌) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. 
*ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు-1954లో రక్షణ శాఖలో మార్పులు చేసింది. 
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. 
* త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. 
*దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను ప్రకటించే అవకాశం. 
* సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గానూ కొనసాగుతారు. 
*సీడీఎస్‌ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవిని చేపట్టడానికి వీలుండదు. అలాగే ఐదేండ్ల వరకు ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ ప్రైవేట్‌ ఉద్యోగంలోనూ చేరకూడదు. 
*భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును కేంద్రం ఖరారు చేసింది. 
*ఆర్మీ చీఫ్‌గా డిసెంబర్ 31 వ తేదీన పదవీవిరమణ చేసిన నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించారు. 
* భారత్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ పోస్టును తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ చెప్పారు. 
*మిలటరీకి సంబంధించి అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు సలహాలు ఇచ్చేందుకు సలహాదారుడు ఉండాలనే సూచనను ఈ నియామకం ద్వారా అమలు పరచనున్నారు. 
*ఈ సూచన గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. 1999 కార్గిల్ సంక్షోభం తర్వాత అత్యున్నత మిలటరీ పోస్టును క్రియేట్ చేయాలని అప్పటి కమిటీ సూచించింది. 
*డిసెంబర్ 24న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. 
*చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, లేదా ఇండియన్ నేవీ, లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి నాలుగు నక్షత్రాలు కలిగి ఉన్న అధికారిని నియమిస్తారు. 
* ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించిన నిబంధనలను సవరించింది. 
*ఆయుధాల కొనుగోలు, శిక్షణ, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు వంటివి నిర్వహిస్తారు. 
* మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కార్యక్రమాలు చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలోనే జరుగుతాయి. 
* ఇకపై ఆయుధాల కొనుగోలు విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌పై ఉంటుంది.

ఐర్లాండ్ ప్రధాని వ్యక్తిగత భారత్ పర్యటన
*ఐర్లాండ్ ప్రధాని లియో వరాడ్కర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని తన స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో పర్యటించారు. 
* జూన్ 2017లో ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యాక లియో వరాడ్కర్ తన గ్రామానికి రావడం ఇదే తొలిసారి. 
*అతని స్వగ్రామమైన వరద్... ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలోని మల్వాన్ తహసీల్ పరిధిలో ఉంది. వరాడ్కర్ తండ్రి అశోక్ వరాడ్కర్ వృత్తి రీత్యా వైద్యులు. 
* ఆయన 1960లో యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.


భారత నేవీ లో సోషల్ మీడియా పై నిషేధం
*భారత నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యర్థి దేశాల హానీ ట్రాప్‌లో దేశ నేవీ సిబ్బంది చిక్కకుండా ఉండేందుకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. 
*ఇకనుంచి నేవీ సిబ్బంది ఎవరూ ఫేస్‌బుక్ వంటి సోషల్ సైట్లకు దూరంగా ఉండాల్సిందే. 
*అలాగే నావల్ బేస్,డాక్‌యార్డ్,బోర్డ్ వార్‌షిప్‌లపై సిబ్బంది స్మార్ట్ ఫోన్లు వినియోగించడాన్ని కూడా నేవీ నిషేధించింది. 
*దేశ రక్షణ రహస్యాలు సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులకు చేరుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంది. 
*డిసెంబర్ 20న విశాఖలో ఏడుగురు నేవీ సిబ్బందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. 
* హానీ ట్రాప్‌లో చిక్కుకుని నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వీరు పాకిస్తాన్‌కు చేరవేసినట్టు గుర్తించారు. 
*"సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్, నేవల్ ఇంటెలిజెన్స్‌లు కలిసి పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఓ గూఢచర్య రాకెట్‌ను బట్టబయలు చేశారు. 
*2017లో రిక్రూట్ అయిన ఈ ఏడుగురు సిబ్బంది ఫేస్‌బుక్ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. 
*నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ యువతికి చేరవేశారు. 
*ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు బయటపడటంతో.. నేవి సిబ్బందిని సోషల్ సైట్లకు దూరంగా ఉంచేలా నేవీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.



2019 - సుప్రీంకోర్టు తీర్పులు
1.అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు అనుమతిస్తూ రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వడంతో 164 ఏళ్లుగా నలుగుతున్న, వివాదాస్పదమైన బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసు ముగిసింది. 
*ఆ వివాదాస్పద స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం రామ్ లల్లాకు న్యాయస్థానం అప్పగించింది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
*భారత సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం (40 రోజులు) వాదనలు విన్న రెండో కేసు ఇది. 
*ఈ రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు. 
*"ఈ 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. ఇదంతా ఒకే భూభాగం. ఇది రామ్ లల్లాకు చెందుతుంది. ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి" అని 2019 నవంబర్ 9న ధర్మాసనం తీర్పు చెప్పింది. 
*ఆ తీర్పుపై దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019 డిసెంబర్ 12న కొట్టివేసింది. 2.
*కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను సవరించి, ఇక నుంచి జమ్మూకశ్మీర్ ఒక కేంద్రపాలితంగా, లద్దాఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాయని ప్రకటించిన తరువాత, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 
*ఆ పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020 ప్రారంభంలో ఆ విచారణలను ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఉద్యమాలపై ఆంక్షలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పత్రికా స్వేచ్ఛ, కమ్యూనికేషన్ సేవలపై ఆంక్షలు వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లు కూడా అందులో ఉన్నాయి. 
*కశ్మీర్ అభివృద్ధి కోసం, వివాదాస్పద సమస్యల పరిష్కారానికి ఆర్టికల్ 370ని సవరించామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 3.సుప్రీంకోర్టు ముందున్న మరో క్లిష్టమైన కేసు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించినది. 10 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండేది. 
*అలా మహిళల పట్ల వివక్ష చూపించొద్దని, ఆ ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లి పూజలు చేసుకోవచ్చు అంటూ 2018 సెప్టెంబర్‌ 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 
* ఆ తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దాదాపు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తూ 2019 నవంబర్‌ 14న సుప్రీంకోర్టు నిర్ణయించింది. గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ లేదని స్పస్టం చేసింది. 
*శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి 2020 జనవరిలోగా ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 4.
*మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి ఎన్నికలలో పోటీ చేశాయి. కానీ, ఫలితాల తరువాత బీజేపీకి అధిక సీట్లు ఉన్నప్పటికీ, రెండున్నర సంవత్సరాలు తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసింది. 
*శివసేన వెళ్లి కాంగ్రెస్, ఎన్‌సీపీల కూటమితో జతకట్టి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగానే... రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. 
*ఆ తర్వాత కొద్ది రోజులకు అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 
* ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
*ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకోవాలని, అందుకు రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుసరించొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో, ఎన్‌సీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. 5.
*జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయింపుదారులను ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా స్పీకర్ ప్రకటించారు. 
*2023లో శాసనసభ కాలపరిమితి ముగిసే వరకూ వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కారని ఉత్తర్వులు ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 
*కర్ణాటక మాజీ స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, ప్రస్తుత శాసనసభ కాలపరిమితి ముగిసేదాకా 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేసింది. 
*ఒక వ్యక్తి ఇంత కాలంపాటు ఎన్నికలలో పోటీ చేయకూడదని చెప్పే అధికారం స్పీకర్‌కు లేదని కోర్టు తెలిపింది. దాంతో, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. 6.
*ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన తరువాత, ఆ ఒప్పందంలో సరైన విధానాలు పాటించలేదంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. అందులో అవినీతి కూడా దాగి ఉందంటూ ఆరోపించాయి. 
*విమానాల కొనుగోలులో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు దాఖలయ్యాయి. అయితే, వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. 7.
*భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాలా? పారదర్శకంగా పనిచేయడంలేదన్న అభియోగాలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టును చాలా కాలంగా ఇబ్బంది పెట్టింది. 
* చివరికి, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం కిందకు తెస్తూ 2019 నవంబర్ 13న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 
*సీజేఐ కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉండాలని చెబుతూ తుది తీర్పు నవంబర్ 13న వెలువడింది. 
*సీజే కార్యాలయం కూడా న్యాయవ్యవస్థలో ఒక భాగంగా ఉంది కనుక, సీజే తదితర న్యాయమూర్తులతో కలిపి ఉన్న వ్యవస్థ న్యాయవ్యవస్థ అని రాజ్యాంగ అధికరణ 124లో ఉంది కనుక, మొత్తం న్యాయవ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, సీజే కార్యాలయం సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధర్మాసనం వివరించింది. 
*సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010లో దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. 8.
*మొట్టమొదటి సారి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద లైంగిక వేధింపుల కేసు, న్యాయవ్యవస్థను కుదిపేసింది. గొగోయ్‌కు ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న మహిళ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తన ప్రమేయం ఉన్న కేసు తీర్పులో తనను తాను సమర్థించుకోవడం వివాదాస్పదమైంది. ఆ మహిళ చేసిన ఆరోపణలను పరిశీలించేందుకు జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఆరోపణలను జస్టిస్ బొబ్డే తోసిపుచ్చారు. జస్టిస్ బొబ్డే ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి. 9. 
*వేలాది మంది అట్టడుగు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఉచిత న్యాయ సహాయం పొందొచ్చని 2019 ఆరంభంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 
*వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ఏ వ్యక్తి అయినా న్యాయ సహాయం పొందే వీలుంది. గతంలో ఆ ఆదాయ పరిమితి రూ. 1.25 లక్షలుగా ఉండేది. 10.
*సహజీవనం (లైవ్-ఇన్-పార్టనర్స్) చేస్తున్న వారి మధ్య పరస్పర అంగీకారంతో చేసే సెక్సు అత్యాచారం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలో ఓ వైద్యుడిపై ఒక నర్సు వేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. 11.
*లింగ నిర్ధారిత శిశు ఎంపిక నిషేధ చట్టం- 1994 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ చట్టం ప్రకారం, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. 
*లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్ర వైద్య మండలికి ఉంటుంది. 
*ఈ చట్టంలోని 23(1), 23(2) సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. 12.
*రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 
*స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిపడిన రూ.550 కోట్లు చెల్లిస్తానని చెప్పి, అనిల్ అంబానీ మాట తప్పారని 2019 ఆరంభంలో కోర్టు పేర్కొంది. 
*మార్చి 19లోగా ఎరిక్సన్‌కు రూ.453 కోట్ల బకాయి చెల్లించాలని, లేకుంటే అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఫిబ్రవరి 20న న్యాయస్థానం తేల్చి చెప్పింది.

రాష్ట్రీయం 

తెలంగాణలో రెండోవిడుత పల్లె ప్రగతి

*తెలంగాణ రాష్ట్రంలో రెండోవిడుత పల్లె ప్రగతిలో ప్రధాన లక్ష్యాలను రూపొందించారు. 
*గతంలో నిర్వహించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి మరిన్ని లక్ష్యాలను ముందుంచుకున్నారు. ప్రధానంగా ఆరు లక్ష్యాలతో కార్యాచరణ రూపొందించారు. 
*గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న పల్లె ప్రగతి ప్రణాళిక రెండోవిడుత కొత్త సంవత్సరంలో ప్రారంభం. 
* జనవరి 2 నుంచి ప్రారంభం. 
*రెండోవిడుతలో కూడా ప్రతి గ్రామానికి మండలస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నారు. 
* ప్రతి మండలానికి ఎంపీవో పర్యవేక్షణ చేయనుండగా.. కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుంది. 
*మొదటివిడుతలో చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఆరు లక్ష్యాలతో రెండోవిడుతకు శ్రీకారం చుట్టనున్నారు. 
*ఈసారి ఆర్థిక వనరులపై ప్రధానంగా దృష్టిపెట్టారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు.. స్థానికంగానూ వివిధరకాలుగా నిధులు సేకరించుకోవాలని అవగాహన కల్పించనున్నారు. 
* ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు రూ.7,312 కోట్లు రానున్నాయి. సగటున ఒక్కో పంచాయతీకి రూ.8 లక్షలు అందనున్నాయి. 
* స్వీయ ఆదాయం ద్వారా 500 జనాభా ఉన్న పంచాయతీలకు నెలకు లక్ష, పెద్ద పంచాయతీలకు రూ.4 లక్షల నుంచి 5 లక్షలు రానున్నాయి. 
*రెండో విడుతలో భాగంగా జనవరి 2న తొలిరోజు గ్రామసభ నిర్వహించాలని, కార్యక్రమ ఉద్దేశాలను వివరించి, మొదటివిడుత పల్లె ప్రగతి నివేదికను చదివి వినిపించాలని ప్రభుత్వం సూచించింది. 
* ఆదాయ, వ్యయాలను వివరించి.. ప్రజాభాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తారు. 
*ఈసారి గ్రామసభలో 2020-21 వార్షిక ప్రణాళికలను రూపొందించుకుని గ్రామసభల్లో ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
*ఈ ప్రణాళికకు అనుగుణంగానే బడ్జెట్‌ రూపొందించుకోవాలని సూచించింది. 
*అప్పులు, వేతనాలు, కరంట్‌ బిల్లుల చెల్లింపులన్నీ బడ్జెట్‌లో చేర్చాలి. నిధుల సమీకరణకు ప్రభుత్వం పలు మార్గాలను సూచించింది. 
*బడ్జెట్‌తోపాటు స్వీయ ఆదాయం, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీతో పాటు పలుఅంశాలను ప్రధానంగా సూచించింది. 
*పంచాయతీ విధించే పన్నులు, ప్రత్యేక పన్ను, ఫ్యాక్టరీలు ఉంటే ప్రైవేట్‌ పన్నులు, వాటర్‌ ట్యాక్స్‌, జాతరలు, తీర్థయాత్రల పన్ను, వ్యాపార లైసెన్స్‌లు వసూలుచేయాలని సూచించింది. 
*. నిధుల సమీకరణ మార్గాల్లో భాగంగా రాష్ట్ర బడ్జెట్‌, ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, నరేగా నిధులు, గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, శ్రమదానం, పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ద్వారా నిధుల సేకరించడం, సీఎస్‌ఆర్‌ నిధులకు మార్గాలను సూచించారు. 
* రాష్ట్రవ్యాప్తంగా సీనియర్‌ అధికారుల నేతృత్వంలో 50 ఫ్లయింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటుచేయనున్నట్టు, ఈ బృందాలన్నీ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయని ప్రభుత్వం సూచించింది. 
*లక్ష్యాలు--- -గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేవిధంగా చర్యలు తీసుకోవడం -పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం -గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని రూపొందించడం -గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు తయారుచేయడం -నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం -ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం మరింత పెంచడం

ఏపీఎస్ఆర్టీసీ కి నూతన ఎండీ
*ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌కు నూతన ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
* ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ఎండీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రతాప్ ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. 
*ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీనీ ప్రభుత్వ రంగంలో విలీనం చేసింది. 
* జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 
* ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎండీ స్థానంలో ప్రతాప్ ను ప్రభుత్వం నియమించింది. ఈయన స్థానంలో ప్రస్తుతం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రజత్ భార్గవ్ ను ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమించింది.

No comments:

Post a Comment