Current Affairs in Telugu 9th January

అంతర్జాతీయం 


ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి
*అగ్రశ్రేణి సైనిక జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. 
*పక్కనే ఉన్న ఇరాక్‌లోని అమెరికా, దాని నాటో మిత్రదేశాల సైనిక స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. 
*బగ్దాద్‌కు పశ్చిమాన ఉన్న ఇర్బిల్‌, అల్‌ అసద్‌ స్థావరాల మీద 22 బాలిస్టిక్‌ క్షిపణులు వచ్చి పేలినట్లు, దాదాపు 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' మరణించినట్లు, మరో 200 మంది గాయపడ్డట్లు ఇరాన్‌ ప్రకటించింది.
*1979లో టెహరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్నాక అగ్రరాజ్యంపై ఇరాన్‌ చేసిన అతి పెద్ద దాడి ఇదే.
*ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడుల నేపథ్యంలో ఒక్క అమెరికన్‌కు కూడా హాని కలగలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.
*ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.



చరిత్రలో రెండవ వేడి సంవత్సరంగా
*చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన రెండో సంవత్సరంగా 2019 నిలిచింది.
*ఈ వివరాలను యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) భూతాప పర్యవేక్షణ సంస్థ 'కోపర్నికస్‌ క్లైమెట్ చేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) జనవరి 8వ తేదీన వెల్లడించింది. 
*ఇప్పటివరకూ ఉన్న చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 రికార్డు సృష్టించింది. 
*ఎల్‌నినో కారణంగా ఆ ఏడాది ఉష్ణోగ్రతలు ఏకంగా 0.12 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయి.
*2019లో దానికన్నా 0.04 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
*1981-2010 వ్యవధికి సంబంధించిన సగటుతో పోల్చుకుంటే ఇది 0.6 డిగ్రీల సెల్సియస్‌ అధికం. *పారిశ్రామీకరణకు ముందున్న కాలంతో పోలిస్తే గత ఐదేండ్లలో ఉష్ణోగ్రతలు 1.1-1.2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయి. 
* మరోవైపు, యూరప్‌లో గతేడాది అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది.
*వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పెరుగడం వల్లే 2019 మరో అసాధారణ వేడి సంవత్సరంగా నిలిచింది. 
*2030 నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు కట్టడి చేయాలంటే ప్రతియేటా కర్బన ఉద్గారాల విడుదలను 7.6 శాతం మేర ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 
*ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు, ఇండోనేషియాలో పదుల సంఖ్యలో ప్రజల మృతికి కారణమైన వరదల వంటి ప్రకృతి విపత్తులకు భూతాపమే కారణమని సీ3ఎస్‌ పేర్కొంది.


మలేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు, నెహ్వాల్

*భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్లో విజయాలు సాధించారు. 
*జనవరి 8వ తేదీన జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్‌, ఆరోసీడ్‌ సింధు 21-15, 21-13తో రష్యాకు చెందిన ఎవ్‌గెని కొసెత్సకయాను 35 నిమిషాల్లోనే ఓడించారు.
*మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ సైనా 21-15, 21-17తో లియానె టాన్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో అయా ఒహొరితో సింధు.. ఎనిమిదో సీడ్‌ అన్‌సే యంగ్‌ (కొరియా)తో సైనా తలపడనున్నారు.
*పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ నిరాశ పరిచారు. 
*హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సమీర్‌ వర్మ మాత్రం తొలిరౌండ్‌ను అధిగమించారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ రెండో సీడ్‌ చౌ టెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు.
* సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, రాస్మస్‌ గెమ్కె (డెన్మార్క్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. కశ్యప్‌, మొమోటా చేతిలో ఓటమిపాలయ్యాడు.

భారత వృద్ధి రేటు 5 శాతం- ప్రపంచ బ్యాంకు
*2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 5 శాతంగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 
*అయితే మరుసటి ఏడాది మాత్రం (2020-21) 5.8 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
* వివిధ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు తగ్గిస్తూ వస్తుండగా ప్రపంచ బ్యాంకు కూడా 5 శాతానికి పరిమితం చేసింది.
*గతంలో భారత వృద్ధి రేటును ప్రపంచబ్యాంకు ఆరు శాతంగా అంచనా వేసింది.
*కారణాలు -
  1. రుణాల జారీ మందగించడం
  2. ప్రయివేటు వినిమయం పడిపోవడం
  3. ప్రాంతీయ సమస్యలు
*బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతానికి పైగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
*పాకిస్తాన్‌లో వృద్ధిరేటు 3 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది.
*ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 2.5 శాతంగా అంచనా వేసింది.
*అమెరికా వృద్ధి రేటు 1.8 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.ముఖ్యమైన కారణాలు టారిఫ్ రెట్లు, అస్థిరత. 





జాతీయం 

చిన్న ఉపగ్రహాల కొరకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ

*వాణిజ్య పరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. 
*ఇందుకు సంబంధించి స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)కు రూపకల్పన చేస్తోంది. 
* ఈ ఏడాది ప్రథమార్థంలోనే దీన్ని ప్రయోగించనుంది. 
*ఇందుకోసం తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
*ఇప్పటి వరకూ ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 వంటి ఐదు రకాల రాకెట్‌లను రూపొందించిన ఇస్రో ఆరో రకం రాకెట్‌గా ఎస్‌ఎస్‌ఎల్‌వీని తయారుచేస్తోంది.
*చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగానికి వివిధ దేశాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఇస్రో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందిస్తోంది. 
* అంతేకాకుండా దేశీయంగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రయోగాత్మకంగా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. 
*విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారు తయారు చేస్తున్న బుల్లి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
*ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
*ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ 300 కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన చిన్నతరహా ఉపగ్రహాలను ఎన్నింటినైనా సునాయాసంగా తీసుకెళుతుంది. 
*34 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ రాకెట్‌ ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు వుంటుంది. 
*ఈ రాకెట్‌ను కూడా నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. 
*ఇందులో మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ మాత్రమే ద్రవ ఇంధనం సాయంతో ప్రయోగించేలా డిజైన్‌ చేశారు. 
*300 కేజీల నుంచి 500 కేజీల బరువు కలిగి బహుళ ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో)లోకి ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించారు.

జమ్మూ-కశ్మీర్‌లో అమెరికా బృందం
*అధికరణం 370 రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్‌లో స్థితిగతులను, భద్రతా పరమైన అంశాలను పరిశీలించేందుకు అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ సహా 16 మంది విదేశీ రాయబారుల బృందం జనవరి 9వ తేదీన జమ్మూ-కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించారు. 
*పర్యటనలో భాగంగా రాయబారులు కశ్మీర్‌ లోయలో పౌర సమాజం ప్రతినిధులతో మాట్లాడారు . 
*శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి వివిధ సంస్థల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 
* ఐరోపా సమాఖ్యలోని సభ్య దేశాలు కూడా జమ్మూ-కశ్మీర్‌లో పర్యటించనున్నాయి. 
*వారిని కశ్మీర్‌ లోయకు తీసుకెళ్లి, ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ ఎలా ప్రేరేపిస్తుంది అనే అంశాన్ని ఆ బృందానికి తెలియజేశారు.
*జమ్మూకశ్మీర్ కు చెందిన రాజకీయ నాయకులు గులాం హసన్ మీర్, అల్తాఫ్ బుఖారీ, షోయబ్ ఇక్బాల్ లోన్, హిలాల్ అహ్మద్ షా, నూర్ మొహద్ షేక్, అబ్దుల్ మజీద్ పాడర్, అబ్దుల్ రహీమ్ రాథర్ మరియు రఫీ అహ్మద్ మీర్ వంటి వాళ్లను 15 మంది విదేశీ ప్రతినిధులు కలిశారు.
* గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత కొంత ఉద్రిక్తత నెలకొన్నది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నదని ప్రభుత్వం తెలిపింది.

జనవరి 31 నుండి బడ్జెట్‌ సెషన్‌
*బడ్జెట్‌ సెషన్‌ను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.
*ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న సీసీపీఏ.. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉంటాయి.
*రెండు దశల మధ్య సాధారణంగా నెల రోజుల విరామం ఉంటుంది. 
*బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ కాలంలో పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.



బొగ్గు తవ్వకాల నియమాల సరళీకరణ
*ఖనిజ చట్టాల సవరణ -ఆర్డినెన్స్‌ జారీకి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

*పెట్టుబడులను ఆకర్షించేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఖనిజ చట్టాలను మారుస్తున్నది. 
*జనవరి 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
* ఇది బొగ్గు గనుల కోసం ఏ సంస్థ అయినా పోటీపడేందుకు దోహదం చేస్తున్నది. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంలో బొగ్గు తవ్వకాలు చేస్తున్న సంస్థలే పాల్గొనాలి. 
*ఈ క్రమంలో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) చట్టం 2015లను సవరిస్తూ ఖనిజ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ 2020 జారీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 
* దీంతో నిర్దేశిత సూచనలను పాటించిన ఏ సంస్థ అయినా బొగ్గు గనుల కోసం బిడ్లను దాఖలు చేయవచ్చు.
* కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి
*సవరించిన నిబంధనల ప్రకారం ఈ నెలలోనే తొలి వేలం నిర్వహించనున్నారు.
* గరిష్ఠంగా 40 బొగ్గు గనులు వేలానికి వచ్చే వీలు ఉంటుంది.
*  తాజా నిర్ణయం వల్ల విదేశాల నుంచి బొగ్గు దిగుమతులు తగ్గిపోయి, దేశీయంగా పోటీ వాతావరణం నెలకొననుండగా, ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గుత్తాధిపత్యానికీ తెర పడనున్నది. 
* కోల్‌ ఇండియాకు ప్రభుత్వం నుంచి తగిన మద్దతు కల్పిస్తూ, 2023 నాటికి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా గనులను ప్రభుత్వం కేటాయిస్తుంది.
*బొగ్గు నిల్వలపరంగా ప్రపంచంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం 235 మిలియన్‌ టన్నుల బొగ్గను దిగుమతి చేసుకున్నాం .
*1973లో భారతీయ బొగ్గు రంగం జాతీయకరణ జరిగింది.
*  దీంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ) వ్యక్తం చేసింది. 
* ఏటా 15 బిలియన్‌ డాలర్లకుపైగా బొగ్గు దిగుమతులు భారత్‌లోకి వస్తున్నాయి.
* ఈ మార్చి 31తో ప్రస్తుత గనుల లీజు గడువు తీరిపోతుండటంతో ఉత్పత్తికి విఘాతం కలుగకుండా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని ముగించేందుకు అనుమతి ఇచ్చింది.
* ఈశాన్య గ్యాస్‌ గ్రిడ్‌కు రూ.5,559 కోట్లను అందించాలని నిర్ణయించారు.
* ఈశాన్య రాష్ర్టాల వ్యాప్తంగా 1,656 కిలోమీటర్ల మేర ఈ నాచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు నడుస్తోంది.
* నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికీ కేంద్ర క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది.
*  ఈ సంస్థలో వాటాలున్న ఆరు ప్రభుత్వ రంగ సంస్థలకు వాటిని అమ్ముకోవచ్చు.
* నీలాచల్‌ ఇస్పాత్‌లో ఎంఎంటీసీకి అత్యధికంగా 49.78 శాతం వాటా ఉన్నది. ఓఎంసీకి 20.47 శాతం, ఐపీఐసీవోఎల్‌కు 12 శాతం, ఎన్‌ఎండీసీకి 10.10 శాతం వాటాలున్నాయి. ఎంఈసీవోఎన్‌, బీహెచ్‌ఈఎల్‌కు 0.68 శాతం చొప్పున వాటాలున్నాయి.



మలేషియా శుద్ధి చేసిన పామాయిల్‌ పై ఆంక్షలు
*కాశ్మీర్, పౌరసత్వ చట్టం విషయంలో మలేసియా పాలకులు ప్రధాని మోదీని విమర్శించడంతో... దానికి ప్రతిచర్యగా కేంద్ర ప్రభుత్వం మలేసియా నుంచీ పామ్ ఆయిల్, పామోలిన్‌ దిగుమతులపై ఆంక్షలు విధించింది. 

* ఇదివరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. 
* ఈ ఆంక్షల కారణంగా... ఇప్పుడు శుద్ధి చేసిన పామాయిల్‌ను మలేసియా నుంచీ దిగుమతి చేసుకోలేం. కేవలం క్రూడ్ పామాయిల్ మాత్రమే దిగుమతి చేసుకోగలం.
*విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) --శుద్ధి చేసిన బ్లీచ్డ్‌ డియోడరైజ్డ్‌ పామాయిల్‌, శుద్ధి చేసిన బ్లీచ్డ్‌ డియోడరైజ్డ్‌ పామోలిన్‌ దిగుమతుల విధానాన్ని 'ఉచితం నుంచి పరిమితం' చేసింది.
*ఈ కమొడిటీని పరిమిత జాబితాలో చేర్చడంతో దిగుమతిదారు రవాణా కోసం తప్పనిసరిగా లైసెన్సు లేదా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
*కూరగాయల ద్వారా తయారయ్యే ఆయిల్‌ను (వెజిటబుల్‌ ఆయిల్స్‌) ప్రపంచంలోనే అత్యధికంగా ఏడాదికి 15 మిలియన్‌ టన్నులను భారత్‌ దిగుమతి చేసుకొంటోంది.ఇందులో 9 మి.టన్నులు పామాయిల్‌ కాగా, మిగతా 6 మి.టన్నులు సోయాబీన్‌, పొద్దుతిరుగుడు ఆయిల్‌ ఉంటుంది.
* మలేషియా, ఇండోనేషియా మనకు పామాయిల్‌ను సరఫరా చేస్తున్న దేశాలు. 
*భారత్ ఎక్కువగా పామాయిల్, పామోలిన్‌ను మలేసియా నుంచే దిగుమతి చేసుకుంటోంది. 
*మలేసియాలో ముస్లిం వర్గ ప్రజలు ఎక్కువ. వాళ్లను ఆకట్టుకునేందుకూ, వారి ఓటు బ్యాంకును రాబట్టుకునేందుకూ... మలేసియా ప్రధాని మహతిర్ మహమద్... భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు అని భారత్ విమర్శిస్తోంది.
* ఇండియాలో వాడుతున్న వంట నూనెలో... 66 శాతం పామాయిలే ఉంటోంది. 
*ప్రపంచంలో ఎక్కువగా పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండొనేసియా. ఆ తర్వాతి స్థానం మలేసియాదే.


జాతీయం 

చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకం ప్రారంభం

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదింటి తల్లులకు ఇచ్చే కానుక గా  అమ్మఒడి పథకాన్ని జనవరి 9వ తేదీన ప్రారంభించారు.
*  ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు యేడాదికి రూ.15వేలు ఇస్తారు.
*ఈ పథకాన్ని జనవరి 9వ తేదీన చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
* పిల్లల్ని బడికి పంపే పేద తల్లులకు ఈ పథకం కానుకగా ఇస్తున్నారు.
*అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందజేస్తారు.
*  రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి మేలు చేస్తుంది.
*. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు .
* ఆర్టికల్‌ 21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యా ప్రాథమిక హక్కని, ప్రపంచంతో పోటీపడి విద్యార్థులు చదువుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
* అమ్మ ఒడి సొమ్మును బ్యాంకులు.. పాత అప్పులు సరిచేసుకునేందుకు వాడే వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.










No comments:

Post a Comment