Current Affairs in Telugu 26 end 27th January

అంతర్జాతీయం 

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ విద్యార్థిని
*ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని తెలంగాణ విద్యార్థిని అధిరోహించింది. 
*ఈమె నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్వార్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని. 
*ఈమె పేరు మీదింటి లక్ష్మి 
* ఎప్పుడు?---2020, జనవరి 17న హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన లక్ష్మి కిలిమంజారో పర్వతాన్ని జనవరి 23వ తేదీన అధిరోహించి ప్రతిభ కనబరిచింది. 
*ఆమె మహబూబ్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
*కిలిమంజారో దాని యొక్క మూడు అగ్నిపర్వత సంబంధ శంకువులు కీబో, మావెంజి మరియు షిరా తో ఈశాన్య టాంజానియాలో ఉన్న ఒక అతి తక్కువ రేడియోధార్మికత కల బూడిద మరియు లావాల పొరలను కలిగిన అగ్నిపర్వతం. ఇది సముద్ర మట్టం నుండి 5,895 metres or 19,341 feet ఎత్తును కలిగి ఆఫ్రికాలో ఎత్తైన పర్వతంగా ఉంది. కిలిమంజారో పర్వతం ఎత్తైన నిటారుగా ఉన్న పర్వతం అలానే 5,882 metres or 19,298 feet పీఠభూమి నుండి పైకిలేచిన ప్రపంచంలోని అత్యంత ప్రాముఖ్యమైన నాల్గవ పర్వతంగా ఉంది.



జాతీయం 

పద్మ పురస్కారాలు 2020

*2020 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
*పద్మ విభూషణ్‌-7, పద్మభూషణ్‌-16, పద్మ శ్రీ- 118 వివిధ రంగాలకు చెందిన మొత్తం.. 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి.
1.పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు --
ఒలింపియన్ బాక్సర్ ఎంసి మేరీ కోమ్, 
మాజీ మారిషస్ ప్రధాన మంత్రి అనెరూడ్ జుగ్నౌత్ 
హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు చన్నూలాల్ మిశ్రా 
2.ప్రజా వ్యవహారాలకు సంబంధించిన రంగంలో మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు ---
*బీజేపీ అగ్ర నేతలైన అరుణ్‌జైట్లీ
*సుష్మా స్వరాజ్‌
*మాజీ రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండేజ్‌
*ఆధ్యాత్మికవేత్త విశ్వేశ్వర తీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్ 
*ఆధ్యాత్మికవేత్త విశ్వేశ్వర తీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్
3.పద్మభూషణ్‌-బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు
*మనోహర్ పారికర్‌కి సైతం మరణానంతరం పద్మభూషణ్ అవార్డు 

4.తెలుగువారికి పద్మ పురస్కారాలు --
1. పీవీ సింధు ( క్రీడలు ).పద్మభూషణ్‌
2. చింతల వెంకటరెడ్డి ( వ్యవసాయం )పద్మశ్రీ-తెలంగాణా
3. విజయసారధి శ్రీభాష్యం (సాహిత్యం, విద్య)పద్మశ్రీ-తెలంగాణా
4. ఎడ్ల గోపాల్‌రావు ( కళలు )పద్మ శ్రీ-ఆంధ్రప్రదేశ్‌
5. దలవాయి చలపతిరావు( కళలు)పద్మ శ్రీ -ఆంధ్రప్రదేశ్‌

5.పద్మశ్రీ అవార్డు గ్రహీతలు --
1. శషాధర్ ఆచార్య, ఆర్ట్, జార్ఖండ్
2. యోగి ఏరోన్, మెడిసిన్, ఉత్తరాఖండ్
3. జై ప్రకాష్ అగర్వాల్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఢిల్లీ
4. శ్రీ జగదీష్ లాల్ అహుజా ,సోషల్ వర్క్ పంజాబ్
5. కాజీ మసుమ్ అక్తర్, సాహిత్యం మరియు విద్య, పశ్చిమ బెంగాల్
6. గ్లోరియా అరీరా, సాహిత్యం మరియు విద్య, బ్రెజిల్
7. ఖాన్ జహీర్‌ఖాన్ బక్తియార్ఖన్, క్రీడలు, మహారాష్ట్ర
8. పద్మావతి బందోపాధ్యాయ, మెడిసిన్, ఉత్తర ప్రదేశ్
9. సుశోవన్ బెనర్జీ, మెడిసిన్, పశ్చిమ బెంగాల్
10. దిగంబర్ బెహెరా, మెడిసిన్,
11. దమయంతి బెష్రా విద్య, ఒడిశా
12. పవార్ పోపాట్రావు భగుజీ, సోషల్ వర్క్, మహారాష్ట్ర
13. హిమ్మతా రామ్ భంభు, సోషల్ వర్క్, రాజస్థాన్
14. సంజీవ్ బిఖ్‌చందాని, వాణిజ్య మరియు పరిశ్రమ, ఉత్తర ప్రదేశ్
15. గఫూర్‌భాయ్ ఎం బిలాఖియా, వాణిజ్య మరియు పరిశ్రమ, గుజరాత్
16. బాబ్ బ్లాక్‌మన్, ప్రజా వ్యవహారాలు, యునైటెడ్ కింగ్‌డమ్
17. ఇందిరా పిపి బోరా, ఆర్ట్, అస్సాం
18. మదన్ సింగ్ చౌహాన్, ఆర్ట్, ఛత్తీస్‌గడ్
19. ఉషా చౌమర్, ​​సోషల్ వర్క్, రాజస్థాన్
20. శ్రీ లిల్ బహదూర్ చెత్రి సాహిత్యం మరియు విద్య అస్సాం
21. లలిత మరియు సరోజా చిదంబరం (ద్వయం), కళ, తమిళనాడు
22. డాక్టర్ వజీరా చిత్రసేన, కళ, శ్రీలంక
23. డాక్టర్ పురుషోత్తం దాధీచ్, కళ, మధ్యప్రదేశ్
24. ఉత్సవ్ చరణ్ దాస్, కళ, ఒడిశా
25. ప్రొఫెసర్ ఇంద్ర దస్నాయకే (మరణానంతరం), సాహిత్యం మరియు విద్య, శ్రీలంక
26. హెచ్‌ఎం దేశాయ్, సాహిత్యం మరియు విద్య, గుజరాత్
27. మనోహర్ దేవదాస్, కళ, తమిళనాడు
28. ఓనమ్ బెంబెం దేవి, క్రీడలు, మణిపూర్
29. లియా డిస్కిన్, సోషల్ వర్క్, బ్రెజిల్
30. ఎంపి గణేష్, స్పోర్ట్స్, కర్ణాటక
31. డాక్టర్ బెంగళూరు గంగాధర్, మెడిసిన్, కర్ణాటక
32. డాక్టర్ రామన్ గంగాఖేద్కర్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మహారాష్ట్ర
33. బారీ గార్డినర్, పబ్లిక్ అఫైర్స్, యునైటెడ్ కింగ్‌డమ్
34. చేవాంగ్ మోటప్ గోబా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లడఖ్
35. భరత్ గోయెంకా, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, కర్ణాటక
36. యడ్ల గోపాలారావు, ఆర్ట్, ఆంధ్రప్రదేశ్
37. మిత్రాభాను గౌంటియా, ఆర్ట్, ఒడిశా
38. తులసి గౌడ, సోషల్ వర్క్, కర్ణాటక
39. సుజోయ్ కె గుహా, సైన్స్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్, బీహార్
40. హరేకాల హజబ్బా, సోషల్ వర్క్, కర్ణాటక

భారత్ బ్రెజిల్ మధ్య కీలక ఒప్పందాలు

*భారత గణతంత్ర వేడుకల్లో బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
*వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, చమురు సహజవాయువు వంటి విభిన్న రంగాలకు సంబంధించి భారత్ బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 
*ఏ ఏ రంగాల్లో? ---సైబర్ సెక్యూరిటీ, ఐటి రంగాలలో కూడా పరస్పర సహకార విస్తృతి,సామాజిక భద్రత, బయో ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, వైద్య రంగాల్లోఈ ఒప్పందాలు కుదిరాయి.
*నేపథ్యం-- బ్రెజిల్ అధ్యక్షులు జైర్ మెస్సియస్ బోల్సోనారో భారత్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా
 *భారత్ మరియు బ్రెజిల్ ఇరు దేశాలు దాదాపు $4.5 ట్రిలియన్ల GDP మరియు 1.5 బిలియన్ల జనాభా కలిగి ఉన్నాయి. 
*భారత్ మరియు బ్రెజిల్ మధ్య 2018-19 సంవత్సరంలో $8.2 బిలియన్ల వాణిజ్యం జరగగా( $3.8  బిలియన్ల విలువల గల భారత ఎగుమతులు,$4.4 బిలియన్ల బ్రెజిల్ నుండి భారత్ కు ఎగుమతులు), 2022 నాటికి $15 బిలియన్లకు పెంచడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. 
*ఆయిల్ మరియు సహజ వాయువు,జీవ ఇంధనం అంశాల్లో ప్రత్యేకమైన ఒప్పందం కుదిరింది. 
*ఇరు దేశాల ప్రధాన మంత్రులు ఇథనాల్ ఉత్పత్తిలో సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ రంగంలో బ్రెజిల్ దేశం అపారమైన అనుభవం కలిగి ఉండడం వల్ల దానికి సంబంధించిన సాంకేతికతను భారతదేశానికి ఇవ్వనుంది.
*పశుసంవర్ధక రంగంలో సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.ఇరు దేశాలు పశువుల అంశంలో జనరిక్ హెరిటేజ్ కలిగి ఉన్నాయి.పశువుల ప్రత్యుత్పత్తి పెంచే సాంకేతికత ఇరు దేశాలు పంచుకోవడం ద్వారా భారతదేశంలో డెయిరీ రంగం అభివృద్ధి చేయనున్నారు 
*భారతదేశంలో బ్రెజిల్ సహకారంతో సెంటర్ ఫర్ ఎక్స లెన్స్ ఇన్ కాటిల్ జీనోమిక్స్ ఏర్పాటు చేయనున్నారు. 
*2018లో బ్రెజిల్ లో భారత పెట్టుబడులు $6 మిలియన్లు కాగా భారతదేశంలో బ్రెజిలియన్ పెట్టుబడులు  $1 బిలియన్ గా ఉన్నాయి. 

రికార్డు స్థాయిలో విదేశీ కరెన్సీ నిల్వలు

*ఫారిన్ ఎక్సెంజ్ నిల్వలు గరిష్ట స్థాయికి చేరాయి.భారత్ విదేశీ కరెన్సీ నిల్వలు 462.15 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 
*గత నాలుగు నుండి ఐదు నెలలుగా ఫారిన్ ఎక్సెంజ్‌ నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.  943 మిలియన్ డాలర్లు పెరిగి గరిష్ట స్థాయికి చేరాయి.
*విదేశీ మారక నిల్వలు పెరగడానికి గల కారణాలు--
  1.  విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు ఎక్కువగా పట్టడం
  2. స్థిరంగా ఉన్న చమురు ధరలు
  3. జనవరి నెలలోనే ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల(ఎఫ్‌పీఐ) రూపంలో 234 మిలియన్ డాలర్లు భారత్‌కు వచ్చాయి.
  4. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం,2019లో ఎఫ్‌పీఐ రూపంలో మొత్తం 19.4 బిలయన్ డాలర్లు భారత్‌కు వచ్చాయి.


అత్యధిక శౌర్య పతకాలను పొందిన జమ్మూకాశ్మీర్


*రిపబ్లిక్‌ డే సందర్భంగా పోలీసు సిబ్బందికి వెయ్యి పతకాలను ప్రకటించారు. శౌర్య పతకాల్లో 108  జమ్ముకశ్మీర్‌ పోలీసులకు దక్కాయి. 290 గ్యాలంట్రీ / శౌర్య అవార్డుల్లో 108 జమ్ముకశ్మీర్‌ జవాన్లకు దక్కాయి.  
*సశస్త్ర సీమాబల్‌(ఎస్ ఎస్ బి)కు చెందిన నలుగురు రాష్ట్రపతి సేవా పతకాలకు ఎంపికయ్యారు.
*తీవ్రవాద, తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు ఆర్మీ సిబ్బందికి శౌర్యచక్ర అవార్డు లభించింది. వారు --
*లెఫ్టినెంట్‌ కల్నల్‌ జ్యోతి లామా
*మేజర్‌ కె.బిజేంద్ర సింగ్‌
*నాయిబ్‌ సుబేదార్‌ నరేందర్‌ సింగ్‌ 
*నాయక్‌ నరేశ్‌ కుమార్‌ 
*గత ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో మరణించిన నాయిబ్‌ సుబేదార్‌ సాంబిర్‌కు మరణానంతరం శౌర్యచక్ర ప్రకటించారు.ఎదురుకాల్పుల్లో విదేశీ, 'ఏ++' కేటగిరీ ఉగ్రవాదిని సాంబిర్‌ కాల్చిచంపారు.
*శౌర్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం అత్యంత ధైర్య,సాహసాలు ప్రదర్శించిన ఆర్మీ అధికారులు, ఆర్మీ సిబ్బంది,ఇతర చట్టపరంగా నియమించబడిన దళాల వారికి అందిస్తుంది.


లైంగికదాడుల నియంత్రణపై జైరాం రమేశ్‌ కమిటీ
*పిల్లలపై లైంగికదాడుల నియంత్రణపై రాజ్యసభ కమిటీ నివేదిక
*కమిటీ ఏర్పాటు,నేపథ్యం--సమాజంలో పెరుగుతున్న అత్యాచారాలు, ముఖ్యంగా పిల్లలపై పెరుగుతున్న అత్యాచారాల పట్ల ఆందోళన చెందిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీని నియమించారు. 
*నివేదికలోని అంశాలు --
  1. సోషల్‌ మీడియాలో పిల్లల అశ్లీల చిత్రాలను ప్రసారం చేయకుండా, చూడకుండా అడ్డుకునేందుకు వాటిని పర్యవేక్షించే యాప్‌లను మనదేశంలో అమ్మే అన్ని ఎలక్ర్టానిక్‌ పరికరాల్లో తప్పనిసరి చేయాలని రాజ్యసభ కమిటీ సూచించింది. 
  2. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ నేతృత్వంలోని ఈ కమిటీ జనవరి 25వ తేదీన 40 సిఫారసులతో ఒక నివేదికను సమర్పించింది.
  3.  లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది. 
  4. సమాజంలో పిల్లలతో అశ్లీల కృత్యాలు చేయించడం వంటి భయానకమైన దుర్మార్గాలను అరికట్టేందుకు సాంకేతికపరమైన చర్యలే కాక, సంస్థాగత, సామాజిక, విద్యాపరమైన చర్యలను చేపట్టాలి. 
  5. ఈ దుర్మార్గాలు పిల్లల మనస్థితిపైనే కాక మొత్తం సమాజంపై దుష్ప్రభావం చూపిస్తాయి.సోషల్‌ మీడియా ద్వారా కూడా దీన్ని ఎదుర్కోవాలి. 
  6. పిల్లలకు అశ్లీల చిత్రాలు, అందుకు సంబంధించిన అంశాలు అందుబాటులోకి రాకుండా చూడడంలో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, ఆన్‌లైన్‌ వేదికల్ని బాధ్యత వహించేలా చూడాలి. 
  7. ఆన్‌లైన్‌ సైట్ల నుంచి అశ్లీల దృశ్యాలను తొలగించడం వంటివి చేయాల్సి ఉంది. 
  8. ప్రభుత్వమే ఈ విషయంలో గట్టి నివారణ చర్యలు తీసుకుని, చట్టం ద్వారా కఠిన శిక్షలు అమలు చేసేలా చూడాలి. 


కేంద్రం,ఎన్‌డీఎఫ్‌బీ మధ్య ఒప్పందం

* కేంద్ర ప్రభుత్వం, అస్సాంలోని నిషిద్ధ తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ మధ్య ఒప్పందం కుదిరింది. 
*ఎన్‌డీఎఫ్‌బీ డిమాండ్‌ -- ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి.
*ఒప్పందంలో ఈ కీలకమైన డిమాండ్ ను  పొందుపరచలేదు. 
*ఒప్పందం వల్ల ప్రయోజనం-- 
1.ఈ ఒప్పందం వల్ల బోడోల్యాండ్ ప్రాంతానికి రాజకీయంగా, ఆర్థికంగా ఆకస్మిక ప్రయోజనం చేకూరుతుంది. 
2.ఈ ఒప్పందం అస్సాంలో జీవిస్తున్న బోడో గిరిజనులకు కొన్ని రాజకీయ హక్కులను, ఆర్థిక ప్యాకేజీ అందిస్తారు. 
3.అస్సాం ప్రాదేశిక సమగ్రత కొనసాగింపు. 
4.రాష్ట్రాన్ని విభజించకుండా రాజ్యాంగం పరిధిలో ఈ ఒప్పందం ఉంది. 
5.అస్సాంలో బోడోల తిరుగుబాటుకు ముగింపు పలికే అవకాశం. 
6.1500కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ప్యాకేజీతో బోడో ప్రజల అభివృద్ధికి అన్నివిధాలుగా చర్యలు
7.అసోంలోని కొండ జిల్లాల్లో నివసిస్తున్న బోడో ప్రజలకు కేంద్రం 'హిల్స్ ట్రైబ్' హోదాను తొందరగా ఇస్తుంది. 
8.మొత్తం అసోంలో బోడో బాష(దేవనగరి లిపి) అసోసియేట్ అధికారిక భాష అవుతుంది. 
9.బోడో ప్రాంతం అభివృద్ధి కోసం మూడేళ్లపాటు ఏటా అసోం ప్రభుత్వం 250కోట్లు ఇస్తుంది. కేంద్రం కూడా అంతే మొత్తం మూడేళ్లపాటు ఇవ్వనుంది. అంటే మొత్తంగా 1500కోట్లు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చుచేయనున్నారు.
10.పరిశ్రమలు మరియు ఉపాధి ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి మరియు ఎకో టూరిజం(పర్యావరణ పర్యాటకం) ప్రోత్సహించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి.
11.సామాజిక-సాంస్కృతిక ప్యాకేజీ కింద ప్రభుత్వం ఉపేంద్రనాథ్ పేరిట కేంద్ర విశ్వవిద్యాలయాన్ని, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది.
12.ప్రాంతీయ వైద్య సంస్థ, హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్, మదర్ డెయిరీ ప్లాంట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరిన్ని నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. 
* ఒప్పందంపై సంతకాలు --కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఎన్‌డీఎఫ్‌బీలోని నాలుగు వర్గాల ఉన్నత స్థాయి నాయకులు, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరి సత్యేంద్ర గార్గ్, అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ సంజయ్ కృష్ణ సంతకం చేశారు. 
* ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఉద్యమం జరుగుతూ వస్తోంది.  
* ఈనెల 30న 1,550 మందికి పైగా బోడో క్యాడర్ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు.
*బోడో ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నారు. 
*కోక్రజా, చిరాంగ్‌, బక్సా, ఉదల్‌గిరి జిల్లాలు బోడో ప్రాంతంలో ఉన్నాయి. ఒప్పందం ప్రకారం...బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్(BATD)పిలవబడుతున్నప్రాంతం ఇకపై బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(BTR)గా మార్చబడనుంది.
*బోడోలతో శాంతి ఒప్పందంపై సంతకాలను వ్యతిరేకిస్తూ నాన్ బోడో సంస్థలు 12 గంటల పాటు అస్సాం బంద్‌కు పిలుపునిచ్చాయి. 

పోలీసులకు సేవా పతకాలు
*గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురి పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. 
  1. విశిష్ట సేవా పతకాల విభాగంలో తెలంగాణ నుంచి అడిషనల్‌ డీజీపీ (పర్సనల్‌) బి.శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ లభించింది. 
  2. ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
  3. విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) కొట్ర సుధాకర్‌లకు రాష్ట్రపతి పతకం దక్కింది.
*విభాగాల్లో మెడల్స్‌ దక్కగా.. రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకం, పోలీస్‌ శౌర్య పతకం విభాగాల్లో మెడల్స్‌ దక్కలేదు.
*తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు దక్కాయి. 
  1. అకున్‌ సబర్వాల్‌ (ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌),
  2. టీఎస్‌ఎస్పీ రెండో బెటాలియన్‌ (ఐఆర్‌ యాప్లగూడ, ఆదిలాబాద్‌) కమాండెంట్‌ 
  3. ఆర్‌.వేణుగోపాల్, హైదరా బాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌
  4.  ఇక్బాల్‌ సిద్దిఖీ, బీచుపల్లి పదో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ 
  5. పి.సత్యనారాయణ, నిజామా బాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ 
  6. డి.ప్రతాప్, ఖమ్మం టౌన్‌ ఏసీపీ ఘంటా వెంకటరావు
  7. నల్లగొండ డీఎస్పీ సామ జయరాం, 
  8. 8వ బెటాలియన్‌ (కొండాపూర్‌) ఆర్‌ఐ రవీంద్రనాథ్ 
  9. హన్మకొండ ఏఎస్సై సుధాకర్ 
  10. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ ఏఎస్సై ఎం.నాగలక్ష్మి 
  11.  గండిపేట్‌ ఏఎస్సై ఆర్‌.అంతిరెడ్డి 
  12. పుప్పాలగూడ పోస్ట్‌ సీనియర్‌ కమాండో డి.రమేశ్‌బాబులకు సేవ పతకాలు లభించాయి.
*ఎన్‌పీఏ నుంచి..: నేషనల్‌ పోలీస్‌ అకాడమీ హైదరాబాద్‌ ఎస్‌ఐ (బ్యాండ్‌) బి.గోపాల్‌కు విశిష్ట సేవా పతకాల విభాగంలో మెడల్‌ లభించింది
*ఎన్‌ఐఏ నుంచి: ప్రతిభావంతమైన సేవా పతకాల (పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) విభాగంలో హైదరాబాద్‌ ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి, హైదరాబాద్‌ ఎన్‌ఐఏలో డీఎస్పీగా పనిచేస్తున్న దొంపాక శ్రీనివాసరావుకు పతకం లభించింది.
*భారతీయ రైల్వే నుంచి: హైదరాబాద్‌లో రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తూంకుంట చంద్రశేఖర్‌రెడ్డి, కర్నాటి చక్రవర్తి,   సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దోమాల బాలసుబ్రమణ్యానికి ప్రతిభావంతమైన సేవా పతకం లభించింది.
*ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌ --దేశవ్యాప్తంగా 104 మంది అగ్నిమాపక సర్వీసు అధికారులకు పతకాలు ప్రకటించగా తెలంగాణ నుంచి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజ్‌ కుమార్‌ జనగామ, ఫైర్‌మన్‌ భాస్కర్‌రావు కమతాలకు ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకం లభించింది.
*విధి నిర్వహణలో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన 28 సీబీఐ అధికారులు రాష్ట్రపతి పోలీసు అవార్డులకు ఎంపికయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో పి. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసం యొక్క ప్రధాన గేటు మూసి ఉండడం, సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో డిప్యూటీ ఎస్‌పీ రామస్వామి చిదంబరం నివాసం గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని,ఆయన కుమారుడు కీర్తిని కూడా డిప్యూటీ ఎస్‌పీ రామస్వామి అరెస్టు చేశారు.







No comments:

Post a Comment