Current Affairs in Telugu 22 end 23rd January

అంతర్జాతీయం 
నావిక్‌కు అమెరికా సంస్థ సహాయం

*సహాయం అందిస్తున్న సంస్థ---భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించనున్న శాటిలైట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌-నావిక్‌కు అనువైన చిప్‌సెట్‌ల తయారీని అమెరికాకు చెందిన సెమికండక్టర్‌, టెలీకమ్యూనికేషన్‌ సంస్థ(క్వాల్‌కమ్‌)చేపట్టనుంది.
*తయారు చేసే పరికరాలు---స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తలపెట్టిన నావిక్‌ జీపీఎస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు తగిన చిప్‌సెట్‌లను ఈ సంస్థ తయారుచేయనుంది.
*భారత్‌తో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధిలోని దేశాలకు ఈ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థ(నావిగేషన్‌ సిస్టమ్‌)ను కొనసాగించే వీలుంది.
*నావిక్‌-- 
  1. భారత సొంత ఉపగ్రహాధారిత నావిగేషన్ వ్యవస్థ పేరు నావిక్. 
  2. ఇది భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) దీని ద్వారా ప్రపంచంలో సొంత మార్గదర్శక వ్యవస్థలు గల ఐదు శక్తుల సరసన భారత నిలిచింది. 
  3. నావిక్‌ ద్వారా ప్రజలకు అందించే సేవల్లో 20 మీటర్లకు అటూఇటుగా కచ్చితత్వం ఉంటే.. నియంత్రిత సేవల పేరిట సైనికులకు కేవలం 10 మీటర్ల కచ్చితత్వంతో సేవలు అందించేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేసారు . 

3.3 శాతం ప్రపంచ వృద్ధిరేటు
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తూ వస్తోంది.
*ఐఎంఎఫ్‌ వార్షిక నివేదికలోని అంశాలు --
  1.  2019లో 2.9 శాతం వున్న ప్రపంచ ఆర్థికాభివృద్ధి 2020లో 3.3 శాతానికి, 2021లో 3.4 శాతం వుంటుందని అంచనా వేయగా, ఈ అంచనాలో 0.1 శాతం మేర తగ్గించింది.
  2. ముఖ్యమైన కారణాలుగా,వాణిజ్య విధానాల అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మార్కెట్లలో వ్యక్తిగత వత్తిడిలను పేర్కొంది.
  3.  2019 ద్వితీయార్ధం నుండి వస్తువుల తయారీ, వాణిజ్య రంగాలలో కొనసాగుతున్న అనిశ్చితి ఆధారంగా అంచనాలను తగ్గించింది. 
*ఆర్థికాభివృద్ధికి సవాళ్ళు --పెరుగుతున్న సామాజిక అశాంతి, కరీబియన్‌ దేశాలలో హరికేన్‌లు, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, తూర్పు ఆఫ్రికాలో వరదలు, దక్షిణాఫ్రికాలో కరువు ఇటీవల సవాళ్ళుగా ఎదురయ్యాయి. 

ప్రజాస్వామ్య సూచీలో దిగజారిన భారత ర్యాంక్

*ప్రపంచ  ప్రజాస్వామ్య సూచీ--
*ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ విడుదల చేసింది. 
*ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది.
*2006లో మొట్టమొదటిసారిగా డెమొక్రసీ ఇండెక్స్‌ను విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఈ సూచిని విడుదల చేస్తారు. 
*సూచీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకున్న అంశాలు --ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు. 
*సూచి లోని అంశాలు --
  1. ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్‌ 51వ స్థానంలో నిలిచింది.2018తో పోలిస్తే 2019లో భారత్‌ పది స్థానాలు దిగజారింది.
  2. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు కేటాయించింది.మొత్తం 10 పాయింట్లకుగాను భారత్ 2017, 2018 సంవత్సరాల్లో 7.23, 2016లో 7.81 చొప్పున పాయింట్లను సంపాదించింది. 2014లో అత్యధికంగా 7.91 పాయింట్లు లభించాయి. 
  3. టాప్ 10లో న్యూజిలాండ్ నాల్గో ర్యాంకులో నిలవగా, ఫిన్ లాండ్ (5వ ర్యాంకు), ఐర్లాండ్ (6వ ర్యాంకు), డెన్మార్క్ (7వ ర్యాంకు), కెనడా (8వ ర్యాంకు) ఆస్ట్రేలియా (9వ ర్యాంకు), స్విట్జర్లాండ్ (10వ ర్యాంకు)లో ఉన్నాయి.
  4. ఆసియా, ఆస్ట్రేలియా రీజియన్‌లో భారత దేశానికి 8వ ర్యాంకు దక్కింది. 
  5. ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకులో ఉంది. 
  6.  బ్రెజిల్‌ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాక్‌ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్‌ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి.

*భారత్ 51 వ స్థానంలో ఉండడానికి కారణాలు--దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటం, ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండడం, 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు,సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై దేశవ్యాప్తంగా నిరసనలు, జమ్మూకాశ్మీర్‌లో మొబైల్ నెట్‌వర్క్ సేవల నిలిపివేత,నెలల తరబడి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు కారణాలుగా ఈఐయూ పేర్కొంది. 
*చైనా  153వ ర్యాంకులో మెకానిక్ కి కారణాలు--వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష.
* దేశాల వర్గీకరణ--
  1. సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు)
  2. బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ,8 లేదా అంతకంటే తక్కువ)
  3. మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ)
  4.  నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). 

ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీ
*ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీలో భారత్‌ 72వ స్థానంలో నిలిచింది.
* గత సంవత్సరం కంటే 8 స్థానాలు మెరుగుపడి భారత్ 72వ స్థానంలో నిలిచింది.
*సూచీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకొనే అంశాలు --ప్రతిభను పెంచడం, ఆకర్షించడం, కాపాడుకోవడంలో ఆయా దేశాల సామర్థ్యాలు 
*మొత్తం 132 దేశాలతో  ఈ సూచి ని రూపొందించారు.  ఈ సూచీలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్‌లు 2, 3 స్థానాలు దక్కించుకున్నాయి.


గ్రీస్ కు మొదటి మహిళ అధ్యక్షురాలు
*గ్రీస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ న్యాయమూర్తి ఎకాటెరీనీ సాకెల్లారోపౌలు (63) ఎన్నికయ్యారు.
*ఎన్నిక విధానం-అధికార కన్జర్వేటీవ్‌ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన  ఎన్నిక ప్రతిపాదనకు 261 మంది పార్లమెంట్‌ సభ్యులు మద్దతు తెలపగా, 39 మంది వ్యతిరేకించారు.
*ప్రస్తుత అధ్యక్షుడు ప్రోబ్కోపిస్‌ పావ్లోపౌలస్‌ పదవీ కాలం మార్చి13న ముగియనుంది.అదే రోజు పావ్లోపౌలస్‌ నుంచి ఎకాటెరీనీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.  
*ఎకాటెరీనీ సాకెల్లారోపౌలు నేపథ్యం--
  1.  ఎకాటెరీసీకు న్యాయశాస్త్రంలో నిపుణురాలు. 
  2. ఆమె తండ్రీ సాకెల్లారోపౌలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో బాల్యం నుంచే ఆమె కూడా న్యాయశాస్త్రంపై ఆసక్తి కనబరిచేవారు.
  3. పర్యావరణ పరిరక్షణ అంశంపై వందలాది ఆర్టికల్స్‌ రాశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు.
  4.  కాన్‌స్టిట్యూషన్‌ లా లో ఆమెకు నిపుణురాలు. 
 *గ్రీస్ దేశం--- గ్రీస్ హెలెస్ అనికూడా అంటారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. గ్రీస్ ఐరోపా, ఆసియా, ఆఫ్రికా కూడలి వద్ద ఉంది. బాల్కన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉంది. వాయవ్య సరిహద్దులో అల్బేనియా భూభాగ సరిహద్దులను, ఉత్తర సరిహద్దులో " రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ", బల్గేరియా, ఈశాన్య సరిహద్దులో టర్కీ ఉన్నాయి. ప్రధాన భూభాగానికి తూర్పు సరిహద్దులో ఎజియన్ సముద్రం, పశ్చిమ సరిహద్దులో అయోనియన్ సముద్రం పశ్చిమాన ఉన్నాయి. దక్షిణసరిహద్దులో క్రెటెన్ సముద్రం మరియు మధ్యధరా సముద్రం. 13,676 km (8,498 మైళ్ళు) పొడవుతో, మధ్యధరా సముద్ర తీరం మరియు గ్రీసు సముద్ర తీరప్రాంతం ప్రపంచంలోని పొడవైన సముద్ర తీరప్రాంతాలలో 11వ స్థానంలో ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 227 మానవ నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. గ్రీస్‌లో 80% శాతం గ్రీస్ పర్వతము, మౌంట్ ఒలింపస్ 2,918 మీటర్లు (9,573 అడుగులు) ఎత్తైన శిఖరం ఉన్నాయి. దేశంలో తొమ్మిది భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి: మేసిడోనియా, సెంట్రల్ గ్రీస్, పెలోపొన్నీస్, తెస్సాలి, ఎపిరస్, ది ఏజియన్ దీవులు (డయోడన్కేస్, సైక్లడెస్తో సహా), థ్రేస్, క్రీట్, ఐయోనియన్ ద్వీపాలు.


అమెరికా ఇమ్మిగ్రేషన్ నివేదిక
* ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక 2019 --అంశాలు 
  1. అమెరికాలో ఇతరదేశాలతో పోల్చుకుంటే 2018 లో అమెరికా సరిహద్దు ప్రాంతమైన మెక్సికో కంటే కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 
  2. 2017 తో పోల్చితే ఈ సంఖ్య సుమారు 2.7 శాతం పెరిగింది.ఆ ఏడాది 50,802 మంది పౌరసత్వం తీసుకున్నారు. 
  3. 2019తో పోల్చితే మొత్తం అమెరికా ఇప్పటి వరకూ దాదాపు 8.34 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చింది. 
  4. 2018లో 7,61,901 మందికి (17.3 శాతం) యూఎస్‌ పౌరసత్వం అందించింది.
  5. గత 11 సంవత్సరాలలో ఇది పెరిగి, 2018 లో 9.5 శాతం ఎక్కువగా నమోదయింది. 
  6. 2018 లో అమెరికా దాదాపు 7,61,901 మందికి పౌరసత్వం ఇవ్వగా అందులో మెక్సికో నుంచీ దాదాపు 1,31 వేలమంది ఉన్నారు. 
  7. ఆ తరువాత రెండో స్థానంలో భారత్,మూడవ స్థానంలో చైనా ఉన్నాయి. 
  8. గ్రీన్ కార్డ్ పొందే వారిలో పోల్చితే భారత్ 4వ స్థానంలో నిలిచింది.మెక్సికో, క్యూబా, చైనా తర్వాత 59,281 మంది (మొత్తంగా 5.45 శాతం) భారతీయులు గ్రీన్‌కార్డు పొందారు.


చక్కెర దిగుమతికి ముందుకు వస్తున్న మలేషియా

*మలేషియా నిర్ణయం -- భారత్‌ నుంచి చక్కెర కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించుకుంది.
*ఎంఎస్‌ఎం మలేషియా హోల్డింగ్స్‌ బెర్హాడ్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) భారత్‌ నుంచి 49.20 మిలియన్‌ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెర కొనుగోలు చేయనుంది.
*2019లో ఈ కంపెనీ భారత్‌ నుంచి 88,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేసింది. 
*ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తి సంస్థ అయిన ఎఫ్‌జీవీ హోల్డింగ్స్‌కు చెందినదే ఎంఎస్‌ఎం చక్కెర శుద్ధి కర్మాగారం. 
*ఇటీవల ఇండియా నుంచి 49.40 మిలియన్ డాలర్ల విలువైన 1,30,000టన్నుల ముడి చెక్కెరను దిగుమతి చేసుకుంది మలేషియా.
నేపథ్యం-- 
*కొన్నాళ్ల కిందట ఐరాస సర్వసభ్య సమావేశంలో మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు.ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
*పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్‌ అంశంలో మలేషియా చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే పామాయిల్‌ దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
*మలేషియా నుంచి పామాయిల్‌ కొనుగోలు చేయరాదని దేశీయ వ్యాపారులను ఆదేశించింది. 
* భారత్‌కు అతిపెద్ద పామాయిల్‌ ఎగుమతిదారుగా ఉన్న ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది.
*పామాయిల్‌కు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా. ఇక మలేషియాకు అతిపెద్ద దిగుమతిదారు భారత్‌.
*గతేడాది ఈ దేశం నుంచి 4.4 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు మలేషియా ఎగుమతుల విలువ 10.8 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చు.
*దిగుమతుల విలువ 6.4బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది.
*ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భారత్‌ చక్కెర మిగులు విలువలను కలిగి ఉంది.
*చక్కెర ఎగుమతులకు ఈ సబ్సిడీ ప్రకటించింది.



జాతీయం 

సీఏఏ పై స్టే కు సుప్రీం నిరాకరణ
*అంశం---పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జనవరి 22,2020 వ తేదీన విచారణ చేపట్టింది. 
నేపథ్యం --కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల హక్కులను కాలరాస్తుందని పలు పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి.దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు సుప్రీం కోర్టులో దాదాపు 143 పిటిషన్లు దాఖలు చేశాయి.
*సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంలో పిటిషన్ వేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ కూడా సుప్రీంను ఆశ్రయించారు.
*సీఏఏ అమలు --జనవరి 10 నుంచి సీఏఏని అమల్లోకి వచ్చింది.
పిటిషనర్ల డిమాండ్ -- చట్టం రాజ్యాంగ చెల్లుబాటుతో పాటు సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ పిటిషనర్లు డిమాండ్ చేశారు. చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. 
*సుప్రీంకోర్టు తీర్పు లోని అంశాలు --
  1. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వడం లేదని ప్రకటించింది.
  2.  సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై స్పందన తెలియజేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
  3.  సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టొద్దని, ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది.
  4. సీఏఏను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.


రక్షణ బలోపేతం

*దేశ రక్షణ విభాగంలో శక్తి సామర్ధ్యాలను  పెంపొందించేందుకు భారత నౌకాదళ విభాగం ప్రయత్నిస్తుంది.
*చేపట్టే చర్యలు --
  1. రూ.50వేల కోట్లతో దేశీయంగా ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత్‌కు చెందిన 2 నౌకా నిర్మాణ సంస్థలను, 5 విదేశీ ఆయుధ తయారీ దిగ్గజాలను ఎంపిక చేసింది.
  2. పీ75ఐ అనే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రంగంలోని మజ్గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), ఎల్‌ అండ్‌ టీ సంస్థలను రక్షణ శాఖ ఎంపిక చేసింది. 
  3.  రూ.5,100 కోట్లతో దేశీయంగా సైనిక సామగ్రిని సమకూర్చుకోవడానికి ఆమోదం తెలిపింది. 
  4. స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునికీకరించిన సారంగ్‌ శతఘ్నులను మార్చి 31 నాటికి సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.


ప్రతి నలుగురిలో ఒక నిరుద్యోగి

*భారత్‌లోనూ నిరుద్యోగిత రేటు పెరుగుతూ వస్తోంది.2019-20 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి (సెప్టెంబర్‌- డిసెంబర్‌) గానూ ఇది 7.5 శాతంగా నమోదైంది.
*2016 నవంబర్ నెల తర్వాత నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది.
*సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలోని అంశాలు---
  1. 2017 మే-ఆగస్టులో ఇది 3.8 శాతం వద్ద నమోదుకాగా అప్పటి నుండి క్రమంగా పెరుగుతూ వస్తోంది.
  2.  దేశంలోని 1.74 లక్షల గృహాల నుండి సమాచారం సేకరించారు.
  3. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి నిరుద్యోగులుగా ఉన్నారు.
  4. చదువుకున్న యువతలో ఇది ఎక్కువగా ఉంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతం ఉండగా.. పట్టణాల్లో ఇది 9 శాతంగా నమోదైంది.
  5. 20-24 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగ రేటు 37 శాతం నమోదైంది.వీరిలో గ్రాడ్యూయేట్లే 60 శాతానికి పైగా ఉన్నారు.  
  6. 2019లో పట్టణ యువతలో నిరుద్యోగిత రేటు 63.4 శాతం
  7. గత మూడు సంవత్సరాలలో ఇది అత్యధికం. 20-29 ఏండ్ల మధ్య ఉండి గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసినవారిలో నిరుద్యోగిత రేటు 42.8 శాతంగా ఉంది.

నిరుద్యోగం పై అంతర్జాతీయ కార్మిక సంస్థ  నివేదిక -ముఖ్యమైన అంశాలు 
  1. 'వరల్డ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ సోషల్‌ అవుట్‌లుక్‌' నివేదిక
  2.  2019 వరకు ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్ల మంది నిరుద్యోగులు రిజిష్టర్‌ అయి ఉన్నారు. 
  3. 2020 మరో రెండు కోట్ల వీరందరూ కలిసి 47.3 కోట్ల మంది. ప్రపంచ కార్మిక శక్తిలో 13 శాతం మంది ఉన్నారు. 
  4.  ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు గత దశాబ్దం నుంచి తగ్గడం లేదు.
  5.  గతేడాది అది 5.4 శాతం నమోదైంది.  47 కోట్ల మందిలో సుమారు 26.7 కోట్ల మంది నిరుద్యోగులు 15-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు.వీరు నిరుద్యోగులే గాక ఎలాంటి ఉపాధి శిక్షణా కోర్సులలోగానీ, వృత్తి విద్యా కోర్సులలో గాని శిక్షణ పొందడం లేదు.
  6. ప్రపంచ కార్మిక శక్తిలో 60 శాతానికి పైగా మంది అసంఘితరంగ ఆర్థిక వ్యవస్థలోనే పనిచేస్తున్నారు.
  7. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 63 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. వీరి కనీస ఆదాయం రోజుకు రూ. 210 (3 యూఎస్‌ డాలర్లు) కూడా ఉండటం లేదు.
  8. 2004-2017 మధ్య కాలంలో వేతనాలు, ఇతర శ్రమ ఖర్చుల నిమిత్తం చెల్లించే జాతీయాదాయం వాటా కూడా 54 శాతం నుంచి 51 శాతానికి తగ్గింది.
  9. ప్రజల మధ్య ఉన్న ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. 


భారత్ నేపాల్ మధ్య రెండో చెక్ పోస్ట్


*భారత్‌, నేపాల్‌ సరిహద్దులో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలితో కలిసి వీడియో లింక్‌ ద్వారా జనవరి 21వ తేదీన ప్రారంభించారు.
* ప్రాజెక్ట్ -జోగ్‌బని-బిరాట్‌నగర్‌ చెక్‌పోస్టు నిర్మాణం 
*ప్రాజెక్టు వ్యయం -ఈ చెక్‌పోస్ట్‌ నిర్మాణం కోసం భారత్‌ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది.
*ఉద్దేశ్యం-
1.ఇరుగుపొరుగున గల అన్ని మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని, సరుకు రవాణా వాహనాల రాకపోకలను సరళతరం చేయడానికి, సాఫీగా కొనసాగించడానికి, వ్యాపారం, సంస్కృతి, విద్య వంటి రంగాలలో తమ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు లక్ష్యంగా జోగ్‌బని-బిరాట్‌నగర్‌ చెక్‌పోస్టును భారత్‌ ఇచ్చిన రూ.140 కోట్ల ఆర్థిక సహకారంతో నిర్మించారు. 
2.260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్ట్ రోజుకు 500 ట్రక్కులను తనిఖీ చేసి పంపించగలుగుతుంది. 
3.భారత్‌-నేపాల్‌ మధ్య నిర్మించిన రెండో చెక్‌పోస్ట్‌ ఇది.
4.తొలి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను 2018లో రాక్సౌల్-బీర్‌గుంజ్‌లో నిర్మించారు.  
5.భారత్, నేపాల్ రోడ్డు, రైలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు వంటి అనేక సీమాంతర అనుసంధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నాయి.
2015నాటి భూకంపంతో నష్టపోయిన నేపాల్ కు  భారత్ సహాయం అందించింది.50 వేల ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టింది.45వేలు పూర్తికాగా, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు. 
*నేపాల్ --హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (లాండ్‌లాక్)


సాహసోపేతమైన బాలలకు పురస్కారాలు


*అత్యంత సాహసాన్ని ప్రదర్శించిన 12 రాష్ట్రాలకు చెందిన 10 మంది బాలికలు, 12 మంది బాలురకు జాతీయ సాహస బాలల పురస్కారాలు లభించనున్నాయి. 
* వీరిలో జమ్మూకశ్మీర్‌ నుంచి ఇద్దరు యువకులు, కర్ణాటక నుంచి ఓ బాలుడున్నాడు. వీరిలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన సర్త్‌రాజ్‌ మొహిదిన్‌ ముగల్‌ (16)(ఇంటిపైకి శతఘ్ని గుండును ముష్కరులు ప్రయోగించినప్పుడు కుటుంబ సభ్యుల్ని రక్షించిన సర్తాజ్‌ మొహిదీన్‌ (జమ్మూ-కశ్మీర్‌)ఉండగా, ముదసిర్‌ అష్రఫ్‌ (19) కశ్మీర్‌లో దురాక్రమణ చర్యలను ఎంతో ధైర్యసాహసాలతో అడ్డుకున్నారు. 
* ఏప్రిల్‌లో కేరళలోని కోజికోడ్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ ముసీన్‌ (19) నీటిలో మునిగిపోతున్న తన ముగ్గురి స్నేహితులను కాపాడి..ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్‌ ముసీన్‌ను మరణానంతరం ఇచ్చే అభిమన్యు అవార్డుకు ఎంపికచేశారు.
*కర్ణాటకకు చెందిన వెంకటేశ్‌ (11)అనే బాలుడు గతేడాది వరదల సమయంలో అంబులెన్స్‌లో ఓ మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులను గైడ్‌ చేసి వారిని సురక్షితంగా కాపాడాడు. 
* నలబై మంది బస్సు ప్రయాణికుల్ని మంటల నుంచి కాపాడిన ఆదిత్య (కేరళ) కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 
*వెంకటేశ్‌ జాతీయ సాహస బాలల పురస్కారం అందుకోనున్నాడు.
* అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం సాహస బాలల పురస్కారాలు ప్రదానం చేస్తారు. 
*వీరంతా గణతంత్ర దినోత్సవాల్లో ఈ పురస్కారాలను అందుకోనున్నారు. 
*సాహస బాలల పురస్కారాలను ప్రతి సంవత్సరం 25 మంది బాలలకు అంటే 16 సంవత్సరాలలోపు వయసున్న  అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు అందిస్తారు. 
*ఈ పురస్కారాలను కేంద్ర మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ సంయుక్తంగా అందిస్తారు. 
*1957  లో ఈ పురస్కారాలను ప్రారంభించారు.  
*సాహస బాలల పురస్కారాలను ఐదు రకాలు ఉంటాయి, అవి
 భారత్ అవార్డ్, గీత చోప్రా అవార్డ్, సంజయ్ చోప్రా అవార్డ్, బాపు గాంధియన్ అవార్డు,జనరల్ నేషనల్ బ్రేవరీ ఐ అవార్డు. 



కేంద్ర బ్యాంకు పారదర్శకత

*'పబ్లిక్‌ మినిట్స్‌'-- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) లో పారదర్శకత పెంచేందుకు పబ్లిక్‌ మినిట్స్‌' ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. 
*పారదర్శకత ఎలా? సంస్థ నిర్వహణకు సంబంధించిన వివరాలను ఇకమీదట ఆర్‌టిఐ చట్టం ద్వారా కోరే అవకాశం లేకుండా ఉండడంతో పాటు పారదర్శకతతో సంస్థ పనితీరునకు సంబంధించి వివరాలను మినిట్స్‌ ద్వారా అందుబాటులోకి తెస్తారు . 
* మొదటగా బోర్డు సమావేశాల వివరాలను ఇటీవల నమోదు చేశారు. 
*2019 అక్టోబర్ లో ఛండీఘడ్‌లో జరిగిన సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్ల సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఆర్‌బిఐ అందుబాటులో ఉంచింది. 
*అందులో కొన్ని భాగాలను మాత్రం బ్లాక్‌ చేసింది. 
*ఆర్‌టిఐ చట్టం ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇకమీదట డైరెక్టర్ల సమావేశాల మినిట్స్‌ను ఆర్‌బిఐ వైబ్‌సైట్‌లో ఉంచనుంది. 


గగన్‌యాన్‌ -ఫ్రాన్స్‌ సహాయం; 'వ్యోమమిత్ర'


*భారత్‌ తొలిసారిగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌' కోసం ఫ్రాన్స్‌ సహాయం అందించనుంది.2022 సంవత్సరంలో భారత్ గగన్‌యాన్ పేరిట అంతరిక్ష పరిశోధన చేపట్టనున్నది. 
*ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్‌ఇఎస్ అధ్యక్షుడు జీన్-వైవిస్ లె గాల్ 
*ఫ్రాన్స్‌ అందించే సమాచారం --
  1. భారత వైమానిక దళంలోని ఏవియేషన్‌ మెడిసిన్‌ విభాగం నుంచి నిపుణులను ఎంపిక చేయడం 
  2. గగన్‌యాన్‌ లో పాల్గొనే  వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షించడంపై మన దేశానికి చెందిన ఈ నిపుణులకు శస్త్రచికిత్స నిపుణులకు శిక్షణ అందించడం 
  3. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి, ఏ సమయంలో ఎటువంటి మందులు (ఔషధాలు) తీసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై వ్యోమగాములకు ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు.
  4. 2022లో చేపట్టే గగన్‌యాన్‌ కింద ముగ్గురిని అంతరిక్షంలోకి భారత్‌ పంపనుంది. వీరు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఫ్రాన్స్‌ పంపే అవకాశం కూడా ఉంది.
  5. రోదసీ ఔషధ రంగంలో ఫ్రాన్స్‌కు అత్యాధునిక యంత్రాంగం ఉంది. ఇక్కడ ఎంఈడీఈఎస్ స్పేస్ క్లినిక్ ఉంది. స్పేస్ సర్జన్లు ఇక్కడే శిక్షణ పొందుతారు.
**గగన్ యాన్ లో రోబో---
*గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కాగా వీరి ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళా రోబో ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.
*ఆమె పేరు 'వ్యోమమిత్ర'. వ్యోమగాములను అంతరిక్షంలోని పంపడం కంటే ముందే. ఈ వ్యోమమిత్రను నింగిలోకి పంపనుంది. 
* 'వ్యోమమిత్ర' ---ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం వ్యోమ్ మిత్ర అనే ఈ రోబో సగం మనిషి. దీనికి కాళ్లు లేవు. ఇది కేవలం పక్కకు లేదా ముందుకు వంగగలదు. కొన్ని ప్రయోగాలను చేస్తూనే ఇస్రో కమాండ్ సెంటర్‌తో టచ్‌లో ఉంటుంది. 


ఎస్‌బీఐ ఎండీగా చిత్తూరు జిల్లా వాసి


*స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు.
*ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 
*చల్లా శ్రీనివాసులు శెట్టి  నేపథ్యం--
  1.  గతంలో ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు.ఆ సమయంలో చమురు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆటో, టెలికం రంగాల్లో నిరర్థక ఆస్తులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.  
  2. 1988లో అహ్మదాబాద్‌ ఎస్‌బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరారు. 
  3. హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. 

*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా --భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది. 1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. 
*            21 జూన్, 1806: కలకత్తా బ్యాంకు స్థాపన. 
  • 21 జనవరి, 1809: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా .
  • 15 ఏప్రిల్, 1840: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన .
  • 11 జూలై, 1843: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన .
  • 1861: పేపర్ కరెన్సీ చట్టం జారీ .
  • 27 జనవరి, 1921: మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
  • 11 జూలై, 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
  • 1959: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ, దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
  • 1980 కేరళలో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన్ ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేశారు. .
  • 29 జూన్, 2007: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది .
*ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనమైన బ్యాంకులు --






49 మంది బాలబాలికలకు రాష్ట్రీయ బాలశక్తి పురస్కారాలు


*ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారాలు ఈసారి ముగ్గురు తెలుగు క్రీడాకారులకు లభించాయి.
*రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా షూటర్‌ ఇషా సింగ్‌ (14), రోలర్‌ స్కేటర్‌ ఆకుల సాయి సంహిత (14), పర్వతారోహకుడు పోతురాజు సమన్యు (9) పురస్కారాలను అందుకున్నారు. 
*అవార్డు కింద నగదు --లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, పతకం, జ్ఞాపికను రాష్ట్రపతి అందజేశారు.
*వీరితో పాటు మొత్తం 49 మంది బాలబాలికలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. 
* పురస్కారం విశిష్టత---సాహసం, సమాజ సేవ, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందిస్తారు.
*పురస్కార గ్రహీతల  నేపథ్యం-
*హైదరాబాదీ షూటర్‌ ఇషాసింగ్‌ వరల్డ్‌కప్‌, ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో పతకాలు సాధించింది. 
*విశాఖపట్నానికి చెందిన సాయి సంహిత గతేడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్షిప్ కేడెట్‌ విభాగంలో బంగారు పతకం సాధించారు.
*తమ్మినేని భరత్‌ నేతృత్వంలో పోతురాజు సమన్యు ఏడేళ్ల వయస్సులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అత్యంత పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన పర్వతారోహకుడిగా చరిత్ర సృష్టించాడు. 




ఖేలో ఇండియా 2020 క్రీడలు


*ఖేలో ఇండియా 2020 క్రీడల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.
* అసోంలోని గౌహతీ వేదికగా 13 రోజులపాటు ఈ క్రీడలు జరిగాయి. 
*మహారాష్ట్ర యువక్రీడాకారులు 78 స్వర్ణాలతో సహా మొత్తం 256 పతకాలతో మొదటి స్థానంలో నిలిచారు.మహారాష్ట్ర్ర మొత్తం 78 స్వర్ణ, 77 రజత, 101 కాంస్యపతకాలు సాధించింది.
*హర్యానా మొత్తం 200 పతకాలతో రెండోస్థానం లో నిలిచింది.
*అండర్ -17 బాలికల ఈతలో మహారాష్ట్ర్ర స్విమ్మర్ కరీనా షంక్తా రెండో స్వర్ణం సాధించింది.మహారాష్ట్ర్ర ఖేలో ఇండియా ఓవరాల్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండోసారి.
*ఢిల్లీ మూడు, కర్నాటక నాలుగు, ఉత్తరప్రదేశ్ ఐదుస్థానాలలో నిలిచాయి. ఆతిథ్య అసోం ఏడోస్థానం దక్కించుకొంది.
*మొత్తం 28 రాష్ట్రాలు పతకాల పట్టికలో చోటు సంపాదించగా. తెలంగాణా 7 స్వర్ణాలతో సహా 21 పతకాలతో 15వ స్థానంలో నిలిచింది.
*ఆంధ్రప్రదేశ్ మూడు స్వర్ణాలతో సహా మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది.




రాష్ట్రీయం

హైదరాబాదులో ఎస్‌&పీ నూతన కార్యాలయం
* స్టాక్‌మార్కెట్‌, కమాడిటీ మార్కెట్లకు రేటింగ్‌, బెంచ్‌మార్క్‌, అనలిటిక్స్‌ సేవలు అందించే సంస్థ అయిన సౌండ్ అండ్ పూర్(ఎస్‌&పీ) గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. 
*యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ గోల్డ్‌ రేటెడ్‌ లీడ్‌ సర్టిఫికేషన్‌ కల భవనమైన స్కై వ్యూ బిల్డింగ్‌లో 2.41 లక్షల చదరపు అడుగుల నిర్మాణ సంస్థలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.
*ఈ కార్యాలయంలో 3,500 మంది ఉద్యోగులు కూర్చుని పని చేయొచ్చు.
*ఎస్‌&పీ గ్లోబల్‌ ఇండియా కార్యకలాపాల విభాగం ఎండీ అభిషేక్‌ తోమర్‌
*భారత్‌లో హైదరాబాద్‌ అతిపెద్ద టెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా ఉండటం వల్ల, కొత్త కార్యాలయాన్నిహైదరాబాద్ లో ప్రారంభించారు.



విశాఖ ఇండస్ట్రీస్ 'ఆటమ్‌' కు అరుదైన గుర్తింపు

 *విశాక ఇండస్ట్రీస్ కు చెందిన సోలార్‌ రూఫ్‌ 'ఆటమ్‌'(ATUM)కు గ్లోబల్‌ సేఫ్టీ సైన్స్‌ కంపెనీ యూఎల్‌ నుంచి ధ్రువీకరణ లభించింది.
*ఇది కంపెనీ యొక్క వినూత్న ఉత్పత్తి. 
* తాజా అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్‌ కమిషన్‌ (ఐఈసీ), యూఎల్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ధ్రువీకరణ లభించింది.సోలార్‌ ఫొటోవొల్టాయిక్‌(పీవీ) మాడ్యూల్‌ టెస్టుల తర్వాత ఈ సర్టిఫికేషన్‌ లభించింది. 
*విశాకా ఇండస్ట్రీస్‌ ప్రొడక్ట్‌ ఆటమ్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ రూఫ్‌గా గుర్తింపు పొందింది.
* విశిష్టత--ఇది ఐఈసీ సీబీ 2016, యూఎల్‌ 61730 ధ్రువీకరణ పొందిన మొదటి సోలార్‌ రూఫ్‌.
*ప్రయోజనం --
  1. దీనివల్ల 50 దేశాలకు పైగా మార్కెట్లలో ఆటమ్‌ సోలార్‌ రూఫ్‌లను విక్రయించడానికి అవకాశం లభిస్తుంది.
  2. యూరప్‌, లాటిన్‌ అమెరికా సహా 50 దేశాల్లో అడుగుపెట్టేందుకు తాజా సర్టిఫికేషన్‌ ఉపయోగపడనుంది.
*కంపెనీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీ. వంశీకృష్ణ
*నూతన ప్రమాణాలు--
  1. సోలార్‌ ఇండస్ట్రీ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఐఈసీ స్టాండర్డ్స్‌ను 2016 లో మార్చారు. 
  2. క్రిస్టలిన్ సిలికాన్, ఇతర థిన్‌ ఫిల్మ్‌ టెక్నాలజీలతో తయారు చేసి సోలార్ మాడ్యూల్స్ భద్రత, సామర్థ్యాన్ని అంచనావేయడానికి వీటికి ఇతర పరీక్షల విధానాలు, సీక్వెన్స్, కాలపరిమితి వంటి ప్రమాణాలను మార్చారు. 
  3. కొత్త ప్రమాణాల ప్రకారం మాడ్యూల్స్ సైకిల్ టైమ్ 15 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. పర్యావరణంలో యూవీ రేడియేషన్‌ను కంట్రోల్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
  4. ఐఈసీ స్టాండర్డ్స్ ప్రకారం.. వీటికి కొత్త పరీక్ష పద్ధతులు, అర్హతలు, కండీషన్లు, మినిమం డిజైన్లు అవసరం. ఎక్కువ వోల్టేజీతోనూ పనిచేయడానికే ఈ కొత్త స్టాండర్డ్స్‌ను అమలు చేస్తున్నారు. రూఫ్, సోలార్ ప్యానెళ్లతో తయారైన ఆటమ్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
*ఈ  రూఫ్ ప్రత్యేకతలు --
  1. ఈ ఎలక్ట్రిక్ రూఫ్ దాదాపు 30 ఏళ్ల పాటు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 
  2. పాలీ క్రిస్టలిన్ పీవీ సేల్స్, సిమెంట్ ఫైబర్‌ బోర్డుతో దీనిని తయారు చేయడం వల్ల చాలా మన్నికగా ఉంటుంది. 
  3. పైకప్పుగానూ ఉపయోగించగలిగే ప్రపంచంలోని తొలి సోలార్ ప్యానెల్ ఇదే. 
  4. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, అగ్నిప్రమాదం వచ్చినా ఇది తట్టుకుంటుంది.


సెలెక్ట్ కమిటీకి రాజధాని బిల్లు

*ఏపీ లో మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయం తీసుకుంది. 
*సెలెక్ట్ కమిటీకి బిల్లు చేరుకోవడంతో బిల్లూ మూడు నెలలు పాటు పెండింగ్‌లో ఉండనుంది. 
* చైర్మన్ తనకు ఉన్న విచక్షణ అధికారంతోనే రాజధాని బిల్లుని.. సీఆర్డీఏ బిల్లుని చైర్మన్ సెలెక్ట్ కమిటికి పంపినట్టు పేర్కొన్నారు. 
*మండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు.సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది.
*నిబంధనల ప్రకారం వచ్చిన బిల్లులను పరిశీలించి వాటిపై అభిప్రాయం చెప్పే అధికారం సెలెక్టు కమిటీకి ఉంటుంది. అంటే సెలెక్టు కమిటీని శాసనమండలిలో ఉన్న పార్టీల ఆధారంగా దామాషా పద్దతిలో నియమిస్తారు. 
* కమిటీ వేసిన తరువాత బిల్లును లోతుగా అధ్యయనం చేయాలనే అభిప్రాయం వ్యక్తంచేస్తే మూడు నెలల తరువాత మరికొంత సమయం అడిగే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఛైర్మన్‌ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తారు. ఈ కాలంలో సెలెక్టు కమిటీ 13 జిల్లాల్లోనూ పర్యటించవచ్చు.
* స్టాక్‌ హోల్డర్ల అభిప్రాయాలు తీసుకోవచ్చు. 13 జిల్లాల్లో ఈ బిల్లులకు సంబంధించిన అంశాలపై వినతులు తీసుకుని వాటిని క్రోడీకరించడానికి మరికొంత సమయం అడగొచ్చు. 
*కమిటీ నిర్ణయం తెలిపేందుకు కనీసం సంవత్సరం కాలం తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకునేందుకు వీల్లేదు. కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత దానిపై అసెంబ్లీ మరలా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. 


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బిల్లు ఆమోదం
*ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు) కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 
*మండలిలో సూచించిన సవరణలు తిరస్కరించిన అసెంబ్లీ.. ఎలాంటి సవరణలు లేకుండానే శాసన సభ ఆమోదించింది. 
*దీని ద్వారా ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అందిస్తారు.
*పేద విద్యార్థుల కోసం రైట్‌ టు ఇంగ్లీష్‌ విధానంగా దీన్ని ప్రభుత్వం పేర్కొంది.
*36 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందించనున్నారు.
 *ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసించడానికి ఉపయోగపడుతుంది.







No comments:

Post a Comment