Current Affairs in Telugu 11th January

అంతర్జాతీయం 


'ఖతర్‌ ఓపెన్‌ విజేత రోహన్‌ బోపన్న
*భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సాధించాడు. 
*నెదర్లాండ్‌ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న 'ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ 250' టోర్నీలో విజేతగా నిలిచాడు.
*ఫైనల్లో బాంబ్రిడ్జ్‌ (ఇంగ్లాండ్‌)-శాంటియాగో (మెక్సికో) జంటని బోపన్న జోడీ 3-6, 6-2, 10-6 తేడాతో ఓడించింది. దీంతో బోపన్న జోడీ 76,870 డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు 250 ఏటీపీ ర్యాంకింగ్‌ పాయింట్లు గెలుచుకుంది.
*బోపన్న ఖాతాలో 19వ డబుల్స్‌ టైటిల్ ఇది. సెమీఫైనల్లో బోపన్న-కూలాఫ్‌ జంట 7-5, 6-2 తేడాతో హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)- స్కుగోర్‌ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది.




ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ మృతి
*ఆధునిక అరబ్‌ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన నేతగా పేరుగాంచిన ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ కన్నుమూశారు. 
* 1970తో తన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇప్పటి వరకు సుల్తాన్‌గా కొనసాగారు. 
*చురుకైన విదేశీ విధానంతో ఒమన్‌ని ఆధునికత వైపు నడిపించిన నేతగా ఆయనకు పేరుంది. 
*ఆరు దేశాలతో ఇరాన్‌కు కుదిరిన అణు ఒప్పందంలో ఖబూస్‌ నేతృత్వంలోని ఒమన్‌.. ఉభయపక్షాల మధ్య మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో ఒమన్‌కి ప్రాధాన్యం పెరిగింది.
*ఒమన్‌ రాజ్యాంగం ప్రకారం సుల్తాన్ పదవి ఖాళీ అయిన మూడు రోజుల్లోగా కొత్తవారు సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఖబూస్‌ బిన్‌ బ్రహ్మచారి.
*రాజకుటుంబం నుంచైనా లేదా వారు సూచించిన వారైనా సుల్తాన్‌గా బాధ్యతలు స్వీకరించాలి. లేనిపక్షంలో రాజకుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఖబూస్‌ రాసిన లేఖలో పేర్కొన్న వ్యక్తిని సుల్తాన్‌గా నియమిస్తారు. 
*. కాగా రాచ కుటుంబం ఈ బాధ్యతను తీసుకోనట్లయితే.. ఒమన్‌ నిబంధనల ప్రకారం... మిలిటరీ, భద్రతా అధికారులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి పాలకుడిగా తమకు నచ్చిన వ్యక్తిని రహస్య పద్ధతిలో ఎంపిక చేస్తారు. 
*ఒమనీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించి, రాజకుటుంబానికి చెంది, తగిన అర్హతలున్న వ్యక్తిని తదుపరి సుల్తాన్‌గా ఎన్నుకుంటారు. ఈ నిబంధనల ప్రకారం దాదాపు 80 మంది పోటీలో ఉన్నారు.
*65ఏళ్ల తారిఖ్‌ 2017లో ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఈయన పేరు సుల్తాన్ పదవి చేపట్టే అవకాశం ఉంది.


జాతీయం 

ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక హక్కు - సుప్రీం కోర్ట్
*ఇంటర్నెట్‌ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. 

*రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది.
*వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ-బిజినెస్‌ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కువగా జరుగుతుంది.ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
*జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్‌ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
*''అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి''అంటూ చార్లెస్‌ డికెన్స్‌ రాసిన రెండు మహానగరాలు(ఏ టెల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌) నవలలోని వాక్యాలను జస్టిస్‌ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు. 
*'భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్‌ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1), ఆర్టికల్‌ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్‌ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.


జనవరి 3వ తేదీ నాటికి 461.16 బి.డాలర్ల విదేశీ మారక నిల్వలు 
*దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు జనవరి నెల 3తో ముగిసిన వారానికి 3.69 బిలియన్‌ డాలర్లు పెరిగి, జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 461.16 బి.డాలర్లకు పెరిగాయి.*సమీక్షా వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు 3.01 బి.డాలర్లు పెరిగి, 427.95 బి.డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 666 మిలియన్‌ డాలర్లు పెరిగి 28.06 బి.డాలర్లకు చేరాయి. 


*ఐఎంఎఫ్‌ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 7 మి.డాలర్లు పెరిగి 1.45 బి.డాలర్లకు, దేశ నిల్వల స్థితి 3 మి.డాలర్లు పెరిగి 3.70 బి.డాలర్లకు చేరాయి.


నవంబర్ లో 1.8 శాతం అభివృద్ధి సాధించిన ఐఐపీ
*భారత్‌ పారిశ్రామిక రంగం నవంబర్‌లో మూడు నెలల తర్వాత క్షీణత నుంచి వృద్ధి బాటలోకి వచ్చింది.
*పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. 
*ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారత్‌ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. 
* మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం కూడా క్షీణతలో నుంచి బయటపడ్డం మొత్తం గణాంకాలకు కొంత సానుకూలమైంది.
*జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు--
  1. 2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం.
  2. సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం పడింది. నవంబర్‌ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి.
  3. విద్యుత్‌ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా -5 శాతం క్షీణత నమోదయ్యింది.
  4. మైనింగ్‌ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (-2.7 శాతం) తక్కువగా ఉంది. 
  5. భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో -8.6 శాతం క్షీణత నమోదుకావడం జరిగింది.
  6. ఎఫ్‌ఎంసీజీ (కన్జూమర్‌ నాన్‌-డ్యూరబుల్‌ సెగ్మెట్‌) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో -0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు.
*ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే, వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5 శాతంగా ఉంది.




విద్యుత్తు పంపిణీ, నిర్వహణ సూచీ


*దేశంలో విద్యుత్తు పంపిణీ, నిర్వహణలో రాష్ర్టాల సమర్థతపై కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ జనవరి 10వ తేదీన ఢిల్లీలో ఈ సూచీని విడుదల చేశారు. 
*ఇందులో తెలంగాణకు 4వ స్థానం దక్కింది.
* భవనాలు, పరిశ్రమలు, మునిసిపాలిటీలు, రవాణా, వ్యవసాయం-డిస్కమ్‌లు, క్రాస్‌సెక్టార్‌ రంగాలు ప్రామాణికంగా.. సరఫరా నిర్వహణలో రాష్ర్టాల పనితీరుపై వివరాలు సేకరించిన కేంద్రం.. ఈ సూచీని రూపొందించింది.
*టోటల్‌ ప్రైమరీ ఎనర్జీ సప్లై(టీపీఈస్‌) ఆధారంగా రాష్ర్టాలను 4 కేటగిరీలుగా విభజించారు.
* రెండో కేటగిరీలో తెలంగాణ, ఏపీ, హరియాణా, కేరళ, పంజాబ్‌, ఢిల్లీ, చత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ ఉన్నాయి. 
*ఈ కేటగిరీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. హరియాణా, కేరళ, కర్ణాటక తొలి మూడు స్థానాలను దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో నిలిచింది.
*రెండో గ్రూపులో తెలంగాణకు డొమెస్టిక్‌ సరఫరాలో మూడో స్థానం.. పరిశ్రమల విభాగంలో నాలుగో స్థానం
*మునిసిపాలిటీల్లో విద్యుత్తు సరఫరాలో తెలంగాణ టాప్‌.. రవాణా రంగంలో మూడో స్థానం, క్రాస్‌ సెక్టార్‌లో రెండో స్థానంలో, వ్యవసాయ - డిస్కమ్‌ రంగంలో ఏడో స్థానం





అమలులోకి వచ్చిన 'పౌరసత్వ (సవరణ) చట్టం
*పౌరసత్వ సవరణ చట్టం (CAA)జనవరి 10,2020 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. 'పౌరసత్వ (సవరణ) చట్టం 2019 (47)లోని సెక్షన్‌ 1లోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం దాఖలైన అధికారాల మేరకు ఈ చట్టంలోని నిబంధనల అమలుకు 2020 జనవరి 10వ తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది' అని తెలుపుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
*ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు. 2019 ఏడాది డిసెంబర్‌ 11న సీఏఏకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.
*పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపరమైన అణిచివేతను ఎదుర్కొని 2014 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని ఈ చట్టంలో ఉంది. 
*కాగా, సీఏఏ పేరుతో దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నారని, రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ముస్లింలతోపాటు విపక్ష పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 



ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండ్ అయిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌
*భారత నౌకాదళ చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైంది. 
*యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై.. నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్ ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఎల్‌సీఏను డీఆర్‌డీవో తయారు చేసింది.
*స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ద విమానాన్ని.. విక్రమాదిత్యపై దించడం ఇదే తొలిసారి.
* ఈ ఫైటర్ విమానాన్ని డెవలప్ చేసేందుకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తీవ్రంగా కృషి చేస్తుంది.
*గోవాలోని షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌లో ఈ పరీక్ష కొనసాగింది. విక్రమాదిత్యపై ల్యాండ్ అయ్యేందుకు పైలట్లు కొన్ని వంద గంటల పాటు ట్రైనింగ్ చేశారు.
* లైట్ కంబాట్ విమానానికి కమాండర్ జైదీప్ మాలంకర్ పైలట్‌గా చేశారు.




కన్నడ రచయిత చిదానంద మూర్తి మృతి
*సాహిత్య వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు మరియు రచయిత డాక్టర్ చిదానంద మూర్తి 11 జనవరి 2020 న  బెంగళూరులో కన్నుమూశారు.
*చిదానంద మూర్తి నేపథ్యం --వ్యతిరేకతతో సంబంధం లేకుండా సైద్ధాంతిక వైఖరికి పేరుగాంచిన ఎన్నో రచనలు చేశారు చిదానంద మూర్తి. కర్ణాటక కన్నడ భాష, సంస్కృతి, భూమి మరియు కర్ణాటక చరిత్రపై తన పరిశోధనలు చేసి చరిత్రకారుడుగా నిలిచారు.
*హంపి విజయనాగర సామ్రాజ్యం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు చిదానంద మూర్తి. మే 10, 1931 న దావనగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకాలో జన్మించిన చిమూ మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.
* మైసూరు విశ్వవిద్యాలయంలోని కువెంపు, పు టీ నా, టీ నామ్ శ్రీ మరియు చరిత్రకారుడు ఎస్ శ్రీకాంత శాస్త్రి వంటి సాహిత్య ప్రతిభావంతుల ప్రభావంతో, చి ము ప్రశంసలు అందుకున్నారు. రచయిత మరియు పరిశోధకుడిగా స్థిరపడ్డారు.
*కన్నడ శాసనాలపై ఆయన చేసిన డాక్టరల్ థీసిస్ కర్ణాటక చరిత్రలో ఒక ముఖ్యమైన రచనగా పరిగణించబడుతుంది.
*ప్రారంభంలో ప్రసిద్ధ యువరాజా కళాశాల మరియు మైసూర్ విశ్వవిద్యాలయం కన్నడ విభాగంలో కన్నడ ప్రొఫెసర్‌గా పనిచేసిన చిమూ తరువాత బెంగళూరు విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగానికి అధిపతిగా మారారు.
*కన్నడకు శాస్త్రీయ భాషా హోదాను పొందడంలో చిమూ ముఖ్యమైన పాత్ర పోషించారు. హిందూ-రైట్ వింగ్ ఛాంపియన్‌గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. 
*హంపి కళాఖండాలను కాపాడాలంటూ ఆయన చేపట్టిన ప్రచారం విస్తృత ప్రాచుర్యం పొందింది. మూర్తి డిమాండ్ మేరకే నిజాం హైదరాబాద్ కర్ణాటక పేరును కల్యాణ్ కర్ణాటకగా ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ఇటీవల మార్చారు.






'సీ గార్డియన్స్‌' ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య

*భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. 
*'సీ గార్డియన్స్‌' పేరుతో చైనా-పాకిస్థాన్‌ తొమ్మిది రోజులపాటు సంయుక్తంగా జరిపే భారీ నౌకా విన్యాసాలు జనవరి 13న ప్రారంభం .
*ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్‌ తన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది.
*మిగ్‌ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపడం జరిగింది.
*ఇరు దేశాలకు చెందిన డిస్ట్రాయర్స్‌, ఫిగ్రేట్స్‌తోపాటు సబ్‌మెరైన్స్‌ కూడా ఇందులో భాగం.
*ఇరు దేశాల మధ్య అంతర్‌ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా 'సీ గార్డియన్స్‌' పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను నిర్వహిస్తారు.
*చైనా ఉత్తర అరేబియా సముద్రంలో పాక్‌కు చెందిన లోతైన నీటి గ్వాడార్‌ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ గ్వాడార్‌ 60 బిలియన్‌ డాలర్లతో రూపొందుతున్న చైనాలోని జిన్జియాంగ్‌ ప్రాంతంలోని చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సిపిఇసి)ని అనుసంధానిస్తోంది.
*INS విక్రమాదిత్య భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన  విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.



భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆధునిక ఫెన్సింగ్
*భారత దేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాట్లను నిరోధించేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*కత్తిరించడానికి, తొలగించడానికి వీలులేని విధంగా అత్యాధునిక కంచెను నిర్మించాలని నిర్ణయించింది.
* పాత కంచెను త్వరలో తొలగించి, ఈ అత్యాధునిక కంచెను నిర్మిస్తారు. 
*ఈ కొత్త కంచెను కత్తిరించడం సాధ్యం కాదు.
*ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇటువంటి కంచెను లాఠిటిలా సిల్చార్ సెక్టర్‌ వద్ద నిర్మిస్తున్నారు. 7.18 కిలోమీటర్ల పొడవున రూ.14.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
*ఇదేవిధంగా భారత దేశం-పాకిస్థాన్ సరిహద్దుల్లో కూడా కంచెను మార్చుతున్నారు.
*కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం సుమారు 300 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ సిద్ధంగా ఉంచింది.
*ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ ఉగ్రవాదులు కూడా వీరిలో ఉన్నట్లు సమాచారం





రాష్ట్రీయం

సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదక రంగంలోకి 'సింగరేణి'
దేశంలోనే థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదక రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా 'సింగరేణి' నిలిచింది.
*ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 220మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్లాంటులలో తొలి ప్లాంటు (ఐదు మెగావాట్లు) విద్యుత్‌ను 33కిలోవాట్స్‌ పవర్‌లైనుకు సింక్రనైజ్‌ చేసి, సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదకతను ప్రారంభించింది.
*మంచిర్యాలలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో పూర్తయిన తొలిదశ ఐదు మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు విద్యుత్‌ ఉత్పాదనను గ్రిడ్‌కు జనవరి 10వ తేదీన అనుసంధానం చేశారు.
*సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ 
*ఈ ఏడాది ఆగస్టు నాటికి 220మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేయనున్నారు.





















No comments:

Post a Comment