Daily Current Affairs In Telugu 18th December 2019

'హాఫ్‌ ది నైట్‌ ఈజ్‌ గాన్‌' నవలకు దక్షిణాసియా సాహిత్య అవార్డు
*భారతీయ రచయిత అమితాబ బాగ్చీ దక్షిణాసియా సాహిత్య అవార్డు-2019 'డీఎ్‌ససీ' గెలుచుకున్నారు. 
*. ఆయన రచించిన 'హాఫ్‌ ది నైట్‌ ఈజ్‌ గాన్‌' నవలకు ఈ అవార్డు దక్కింది. నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ గ్యావాలీ చేతుల మీదుగా బాగ్చీ ఈ అవార్డును స్వీకరించారు. 
* దక్షిణాసియా సంస్కృతి, చరిత్ర, రాజకీయాలను ప్రతిబింబించే రచనలకు ఈ అంతర్జాతీయ సాహిత్య అవార్డును ఏటా ప్రదానం చేస్తారు.
*ఈ అవార్డు కింద $25,000 నగదు అందిస్తారు. 
*ఈ నవల ఇంగ్లీష్ లో రచించిన భారతీయ భాష భావాలను ప్రతిబింబిస్తుంది.
* మానవ సంబంధాలను,భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తుంది.
* హిందీ, ఉర్దూ, సాంగ్ సున్నితత్వాన్నిఈ నవలలో తెలియపరిచారు.
3 రాజధానులతో ఆంధ్ర ప్రదేశ్
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు  ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో డిసెంబర్ 17వ తేదీని ప్రకటించారు. 
* విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 
* రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
* రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఓవర్సీస్ ఇండియన్స్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసలుబాటు
*ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డ్‌ ఉన్న విదేశాల్లోని భారతీయులు, 20 ఏళ్ల లోపు, లేదా 50 ఏళ్ల పైబడిన వయసు ఉండి, ఇటీవలే తమ పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేయించుకుని, భారత్‌కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు  తమ ఓసీఐ కార్డ్‌తో పాటు కొత్త పాస్‌పోర్ట్, రద్దైన పాత పాస్‌పోర్ట్‌ రెండూ తమ వద్ద పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్‌కు రావచ్చు. 
* ఈ అంశాన్ని భారత హోంశాఖ లోని విదేశాంగ విభాగం డిసెంబర్ 17వ తేదీన ప్రకటించింది. 
*2020, జూన్‌ 30 వరకు ఈ వెసులుబాటు కల్పించనున్నారు. 
క్యాబ్ కు నిరసనగా పద్మశ్రీ వాపస్ 
* పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా ఉర్దూ ప్రముఖ రచయిత ముజ్‌తబా హుసేన్ నిరసన తెలియజేశారు. 
* గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నపుడు ఉర్దూ ప్రముఖ రచయిత ముజ్‌తబా హుసేన్ కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేంద్రప్రభుత్వం తాజాగా పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చినందుకు నిరసనగా తనకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి కేంద్రానికి ఇస్తున్నట్లు ముజ్‌తబా హుసేన్ ప్రకటించారు.
*ముజ్‌తబా హుసేన్  --‘‘గంగా జమున తేహజీబ్ సంస్కృతి అమలులో ఉన్న మన దేశంలో రోజురోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి.దేశంలో మతం పేరిట విభజనను ఇలాంటి చర్యలకు నిరసనగా పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి కేంద్రానికి వాపసు ఇస్తున్నాను’’ అని ప్రకటించారు.
ప్రమాదకరమైన ఉద్యోగంగా జర్నలిజం 
*ప్రపంచంలోనే 'జర్నలిస్ట్' ఉద్యోగం చాలా ప్రమాదకరమైనదని రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ వృత్తిలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది. 
*ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 49 మంది జర్నలిస్టులు వివిధ సందర్భాలలో ప్రాణాలు కోల్పోయారని ఈ సంస్థ తన తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది.
*ఇందులో అధికభాగం యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న యెమెన్‌, సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలలో నమోదు అయ్యాయి. 
*జర్నలిజం క్రమంగా ప్రమాదకరమైన వృత్తిగా మారుతోందని ఈ సంస్థ హెచ్చరించింది. 
*గత రెండు దశాబ్దాల కాలంలో ఏటా సగటున 80 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని గణాంకాలను ఉటంకిస్తూ ఈ సంస్థ తన నివేదికలో వివరించింది.
*సగటున 80 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు.
*ఈ సంస్థ అధినేత క్రిస్టాఫ్‌ డెలాయర్‌  -- మరణించిన జర్నలిస్టుల్లో శాంతియుత దేశాలకు చెందిన వారే ఎక్కువగా వుండటం జర్నలిజం వృత్తికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 
* ఈ ఏడాది ఇప్పటి వరకూ 389 మంది జర్నలిస్టులు జైలు పాలవగా, గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ.
*ఇందులో సిరియా, ఉక్రెయిన్‌, ఇరాక్‌, యెమెన్‌ తదితర దేశాలలోనే 57 మంది జర్నలిస్టులు అక్రమ నిర్బంధాలకు గురయ్యారు. 
మరాఠా నటసామ్రాట్ మృతి 
*ప్రముఖ రంగస్థల కళాకారుడు, బాలీవుడ్‌ నటుడు డాక్టర్‌ శ్రీరామ్‌ లాగూ (92) కన్నుమూశారు. 
* మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్‌ 16న శ్రీరామ్‌లాగూ జన్మించారు. 
*ఇప్పటివరకు ఆయన వందకు పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన మరాఠీ చిత్రాల్లో సిన్‌హాసన్‌ (1980), సామన (1974), పింజ్రా (1973) ప్రముఖమైనవి. బాలీవుడ్‌ చిత్రాలైన జమానే కో దిఖానా హై (1981), ఖుద్దార్‌(1994), లావారిస్‌ (1981), ఇన్‌సాఫ్‌కా తారాజు(1980) మొదలైన చిత్రాల్లో నటించారు. 
*ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. మరాఠా చిత్రాల్లో ఆయనను నటసామ్రాట్‌ అని పిలుస్తారు. 
*హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలలో దాదాపు 211 సినిమాల్లో నటించిన శ్రీరామ్  ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.
*పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎంఎస్ అభ్యసించారు. ఈఎన్‌టీ సర్జన్‌గా కూడా ప్రాక్టీస్ చేశారు.
దక్షిణాఫ్రికాలో హిందూ రాజకీయ పార్టీ ఏర్పాటు 
*దక్షిణాఫ్రికాలో హిందూ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఆ దేశ ఎన్నికల సంఘం వద్ద 'ద హిందూ యూనిటీ మూవ్‌మెంట్‌' (హెచ్‌యూఎం) పేరు నమోదైంది.
*దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ అధ్యక్షుడు రామ్‌ మహరాజ్‌ హెచ్‌యూఎం జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు. 
*డర్బన్‌లో ఉండే జయరాజ్‌ బచ్చు ఆ పార్టీ జాతీయ నాయకుడిగా వ్యవహరిస్తారు.
*దక్షిణాఫ్రికా దేశంలో భారతీయులు ఎంతోమంది ఉన్నారు.
* బ్రిటిష్ పరిపాలన కాలంలో అక్కడి చెరుకు తోటల్లో పనికోసం ఇండియా నుంచి లక్షలాది మందిని దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు. అక్కడ పంటపొలాల్లో పనులకు కుదిర్చారు. 
* ఆ తరువాత బ్రిటిష్ పాలన అంతం తరువాత కూడా ఇండియన్స్ అక్కడే స్థిరపడ్డారు.
* అక్కడ చట్టసభల్లో కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు. కాగా, ఇప్పుడు హిందువుల పరిరక్షణ కోసం, హిందువులకు సంబంధించిన విషయాలను చట్టసభల్లో వినిపించడం కోసం  'ద హిందూ యూనిటీ మూవ్‌మెంట్‌' పార్టీ పుట్టుకొచ్చింది. 
* ఈ పార్టీని ఇటీవలే రిజిస్టర్ అయ్యింది. దీనికి హిందూ ధర్మ సభ అధ్యక్షుడు రామ్ మహారాజ్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉంటారు. జయరాజ్ జాతీయ నాయకుడిగా ఉంటారు.
*హిందువులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ పార్టీ చూసుకోబోతున్నది. జాతీయ స్థానిక చట్టసభల్లో హిందువుల వాణిని బలంగా వినిపించ బోతోంది.
*గతంలో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ భాషలను పాఠ్యంశాలుగా చేర్చాలని, దీపావళిని ప్రభుత్వ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
* 2021 మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయనుంది. 
*దక్షిణాఫ్రికాలో ఇప్పటికే ముస్లింలు, క్రైస్తవులకు పార్టీలున్నాయి. 
*దక్షిణ ఆఫ్రికా ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2,798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి.ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వేఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి.
* దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది.
నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
*అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
*  2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్రం నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను డిసెంబర్ 17వ తేదీన ప్రారంభించింది.
*రాబోయే 4 సంవత్సరాలలోఈ మిషన్ కోసం రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం  ఉంది.
*ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఈ ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించారు.
* 2024 నాటికి 30 లక్షల కిలోమీటర్ల మేర అప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయడంతోపాటు ప్రతి వెయ్యి మందికి ఒక టెలికం టవర్‌ను ఏర్పాటు చేయబోతున్నది.
*2022 నాటికి అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు ప్రస్తుతం దేశీయంగా ఉన్న 5.65 లక్షల టవర్లను 10 లక్షలకు పెంచనున్నారు.
* విద్యా, ఆరోగ్యం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అభివృద్ధిలో టెక్నాలజీకల్ మౌలిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ మిషన్ కీలకంగా మారనుంది.
* అలాగే ఇంటర్నెట్ వేగాన్ని కూడా భవిష్యత్తులో 50 ఎంబీపీఎస్‌లకు పెంచేందుకు కూడా కేంద్రం ప్రణాళిక రూపొందిస్తుంది.
*డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత వేగితరం చేయడానికి ఈ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ రూపొందించారు. డిజిటల్ సాధికారిత, తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్నదే ఈ మిషన్ లక్ష్యం.
*కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ 
*భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 
In brief -
* దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటు.
* ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది జనాభాకు 0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం.
* మొబైల్‌, అంతర్జాల సేవల నాణ్యతను గుణాత్మకంగా మెరుగుపరచడం.
* దేశవ్యాప్తంగా ఆప్టికల్‌ ఫైబర్‌, టవర్‌ నెట్‌వర్క్‌ను గుర్తిస్తూ డిజిటల్‌ ఫైబర్‌ మ్యాప్‌ను రూపొందించడం.
* భాగస్వామ్య సంస్థల ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం.
హెచ్ఐవి నియంత్రణకు త్రీ ఇన్ వన్ మందు 
*హెటిరో హెల్త్‌కేర్‌ దేశీయ మార్కెట్లోకి హెచ్‌ఐవీ-1ను నియంత్రించే ఔషధాన్ని విడుదల చేసింది.
*3-ఇన్‌-వన్‌ కలిగిన ఈ మందును టాఫిక్‌ బ్రాండ్‌తో ప్రవేశ పెట్టింది. 
* గిలేడ్‌ బిక్తార్వేకు జనరిక్‌ వెర్షన్‌గా ప్రవేశపెట్టిన ఈ ఉత్పత్తికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కూడా ఇచ్చింది.
*ఈ ఔషధాన్ని దేశీయ రిటైల్‌ మార్కెట్లో హెటిరో హెల్త్‌కేర్‌ విక్రయించడంతోపాటు డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. 
*బిక్టేగ్రావిర్‌(50ఎంజీ), ఎంట్రిసిటాబైన్‌(200ఎంజీ), టెనోఫోవిర్‌ అలాఫేనమిడే(25ఎంజీ) అనే మూడు మందుల కాంబినేషన్‌తో తయారైన ఈ టాఫిక్‌ రోగులు రోజుకు ఒక్కటి వేసుకోవాలి. 
*ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు దీన్ని అందించనుంది. 
*హెచ్ ఐ వీ 1 వ్యాధి సోకిన వారు ఈ ట్యాబులెట్ లో నయం చేసుకోవచ్చు.
December 17th Current Affairs               

No comments:

Post a Comment