పౌరసత్వ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

*పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారింది. 
*డిసెంబర్ 9వ తేదీన లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభకు పంపగా డిసెంబర్ 11వ తేదీన రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. 
*రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. 
*పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB.
*పౌరసత్వ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని భావిస్తున్నాయి. 
*బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఐయూఎంఎల్‌ తన పిటిషన్‌లో తెలిపింది.
* పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనలు చేపట్టాయి. 
*అసోం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. 
NEXT

No comments:

Post a Comment