ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిథ్యం తొలగింపుకు కేంద్ర నిర్ణయం

*లోక్‌సభలో అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం తొలగింపునకు కేంద్రం రాజ్యాంగ సవరణను చేపడుతోంది.
* డిసెంబర్ 9వ తేదీన ఈ మేరకు సవరించిన బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశ పెట్టింది.
* భారత దేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా బాగానే ఉంది. వారికంటూ చట్టసభల్లో చోటు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది. గత 70 ఏళ్లుగా ఆంగ్లో ఇండియన్స్‌కు ఇటు పార్లమెంటులో అటు రాష్ట్ర అసెంబ్లీల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు.
*గత 70 ఏళ్లుగా అమలులో ఉన్న అంశాన్ని కేంద్రం తొలగిస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది.
* ఈ బిల్లు ప్రకారం ఆంగ్లో ఇండియన్స్‌కు చట్ట సభల్లో చోటు కల్పించేలా ఉన్న ప్రొవిజన్‌ను గత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రొవిజన్ వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. అయితే ఇకపై పొడిగించరాదని సవరణ చేస్తూ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం.
*కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ --దేశవ్యాప్తంగా 296 మంది మాత్రమే యాంగ్లో ఇండియన్ కమ్యూనిటికీ చెందిన వారు ఉన్నారు. 
*రాజ్యాంగంలోని ఆర్టికల్ 334లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రొవిజన్లు ఉండగా అదే ఆర్టికల్‌లో చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా ఉంది. 
*లోక్ సభకు రాష్ట్రపతి ఇద్దరూ ఆంగ్లో-ఇండియన్ లను నామినేట్ చేస్తారు. 
*రాష్ట్రాల్లో అసెంబ్లీ కి ఒక ఆంగ్లో-ఇండియన్ సభ్యుడిని గవర్నర్ నామినేట్ చేస్తారు.(ప్రకరణ  170)
*రాజ్యాంగంలోని 126వ సవరణ బిల్లు ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంపై మరో పదేళ్లు పొడగిస్తూ బిల్లును పాస్ చేసింది ప్రభుత్వం. 

No comments:

Post a Comment