ఐఓసీకు చైర్మన్‌గా శ్రీకాంత్ మాధవ్ వైద్య

*ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు చైర్మన్‌గా శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య నియమితులయ్యారు. 
* ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్‌(రిఫైనరీ)గా విధులు నిర్వహిస్తున్న వైద్యను పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ సెలక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) ఎంపిక చేసింది. 
*ఐవోసీ చైర్మన్‌ కోసం పీఈఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూకి హాజరైన ఐదుగురు సభ్యుల్లో ఆయన కూడా ఒకరు.
* ప్రస్తుతం కొనసాగుతున్న ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ 2020 జూన్‌ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలోనే శ్రీకాంత్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 2023 ఆగస్టు వరకు ఛైర్మన్‌ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
*ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లేదా ఇండియన్ ఆయిల్ భారత దేశంచే నడపబడుతున్న చమురు మరియు సహజవాయువుల సంస్థ. ఇది భారత దేశంలోనే అతి పెద్ద సంస్థ.
* ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మరియు అనుబంధ సంస్థలు కలిపి దేశీయ చమురు ఉత్పత్తుల అమ్మకాల్లో 47% ఆక్రమించాయి, 40% చమురు శుద్ధి సామర్థ్యం కలిగి ఉన్నాయి మరియు దేశం మొత్తం మీద ప్రవాహ ఆధారిత గొట్టాల ద్వారా 67% చమురు సరఫరా చేస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లు దేశంలో ఉన్న 19 చమురు శుద్ధి కర్మాగారాలను సొంతంగా పదింటిని కలిగి ఉంది.వీటి సామర్థ్యం సంవత్సరానికి 60.2 లక్షల మెట్రిక్ టన్నులు.
*1959లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ పేరుతొ ప్రారంభించబడినది, తరువాత 1964లో మిగతా చమురు శుద్ధి కర్మాగారాలు విలీనం ఐన మీదట ది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గా రూపాంతరం చెందింది.
*అలాగే,హిందుజా గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విపిన్‌ సోంధి నియమితులయ్యారు. 
* ఈ పదవి నుంచి వినోద్‌ కే దాసరి వైదొలగిన విషయం తెలిసిందే కాగా, ఆయన స్థానంలో విపిన్‌ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 
*ఇంతకుముందు జేసీబీ ఇండియా, టాటా స్టీల్, శ్రీరామ్‌ హోండా సంస్థలకు విపిన్‌ సేవలందించారు.
NEXT

No comments:

Post a Comment