లాహోర్ మరియు వాఘా మధ్య రైలు సర్వీసుల పునరుద్ధరణ

*పాకిస్తాన్‌లోని లాహోర్‌నుంచి వాఘా(భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం) వరకూ రైలు సర్వీసును పునరుద్ధరించారు. 22 సంవత్సరాల తరువాత ఈ సర్వీసును పునరుద్ధరించారు. 
*వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల పతాకావిష్కరణలు, అవనతం చేయడాన్ని ప్రజలు సందర్శించడానికి వీలుగా ఈ సర్వీసును పునరుద్ధరించారు.
*డిసెంబర్ 15వ తేదీన ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రారంభించారు.
* ఈ రైలు సర్వీసులు 1997 వరకు అందుబాటులో ఉన్నాయి కానీ భద్రత మరియు నిర్వహణ కారణాలతో 1997 లో మూసివేశారు.
*లాహోర్ మెట్రోపాలిటన్ నగరానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలతో అనుసంధానం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ సర్వీసులను ప్రారంభించింది.మరో పదిహేను రోజులలో లాహోర్ నుండి రైవింద్ వరకు మరియొక రైలు ను ప్రారంభించనున్నారు.  
*భాగాలు జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యే వందలాది మంది ప్రయాణికులకు రైలు సేవలు అందిస్తుంది. ప్రతిరోజు మూడు ట్రిప్పులు గా ఈ రైలు ప్రయాణిస్తుంది. మొత్తంగా రోజుకు వెయ్యి మంది  ప్రయాణికులకు సేవలందిస్తోంది. 
NEXT

No comments:

Post a Comment