దక్షిణాసియా క్రీడల్లో మొదటి స్థానంలో భారత్

*నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా గత పదిరోజులుగా జరిగిన దక్షిణాసియా సమాఖ్య దేశాల13వ క్రీడలు ముగిశాయి. 
*1984 నుంచి జరుగుతూవస్తున్న ఈ క్రీడల్లో భారత్ పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత 13వ క్రీడల్లో సైతం భారత్ గతంలో ఎన్నడూలేనన్ని పతకాలు సాధించి టాపర్ గా నిలిచింది.
*మొత్తం 487 మంది అథ్లెట్ల బృందంతో భారత్ ఈ క్రీడలలో పాల్గొంది. 
* 312 పతకాలతో,2016  గువహాటి మరియు షిల్లాంగ్‌లో గేమ్స్ లో సాధించిన 309 పతకాల రికార్డును అధిగమించింది.
*పోటీల ఆఖరిరోజున జరిగిన బాక్సింగ్ ఫైనల్స్ లో భారత్ బంగారు పతకం సాధించింది. 
*  ముగింపు రోజున భారత్ 12 స్వర్ణ, 2 రజత, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. 174 బంగారు పతకాలతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 
* భారత్ సాధించిన మొత్తం 312 పతకాలలో 174 స్వర్ణాలు ఉన్నాయి. 93 రజత, 45 కాంస్య సైతం ఉన్నాయి. 
*గత క్రీడలతో పోల్చిచూస్తే స్వర్ణాల సంఖ్య తగ్గినా, మొత్తంగా పతకాల సంఖ్యను మాత్రం పెరిగింది. 
*నేపాల్ 206 పతకాలతో రెండు, శ్రీలంక 251 పతకాలతో మూడు స్థానాలలో నిలిచాయి. 

No comments:

Post a Comment