కీలక ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా

*ఉత్తర కొరియా డిసెంబర్ 8వ తేదీన తమ దేశంలోని సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి 'అత్యంత ముఖ్యమైన' పరీక్ష నిర్వహించినట్లు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కెసిఎన్‌ఎ పేర్కొంది.
*దేశ వ్యూహాత్మక స్థాయిని పెంచేందుకు ఈ ప్రయోగం చేప్పట్టింది.
*శాటిలైట్‌ ప్రయోగానికి ఉపయోగించే రాకెట్‌లో కానీ, ఖండాంతర గతిశీల క్షిపణిలో కానీ ఉపయోగించగల ఇంజిన్‌ను భూమి మీద పరీక్షించి ఉంటారని భావించవచ్చు.
*ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగించేందుకు అమెరికా నిరాకరించింది.
*ఉత్తర కొరియా తాజా పరీక్షను సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో నిర్వహించింది. ఈ కేంద్రాన్ని మూసివేస్తామని గతేడాది ట్రంప్‌, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జే ఇన్‌లతో కిమ్‌ భేటీ జరిగినప్పుడు హామీ ఇచ్చినట్టు అమెరికా పేర్కొంది.
*. ఉత్తరకొరి యా ఈఏడాది మే నుంచి 13 బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. ఆంక్షలు ఎత్తివేయకుండా ఆలస్యం చేస్తున్న అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 
*. గతేడాది జూన్‌ నుంచి ట్రంప్‌, కిమ్‌ మధ్య మూడు సార్లు భేటీ జరిగింది. కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన, ఉత్తరకొరియా నిరాయుధీకరణ, ఉత్తరకొరియాపై ఆంక్షల తొలగింపు అంశాలు చర్చకు వచ్చాయి.
*ఉత్తర కొరియా అధికారిక నామం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా,ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది.ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా రాజధాని మరియు అతిపెద్ద నగరంగా ఉంది. ఉత్తర కొరియా ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో చైనా, యలు నది, తుమెన్ నది ఉన్నాయి. తుమెన్ నది కొతభాగం ఉత్తరకొరియా మరియు రష్యా మద్య ప్రవహిస్తుంది. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియాల కొరియన్ సైనికరహిత భూభాగం ఉంది.
*1910లో కొరియాను జపాన్ విలీనం చేసుకుంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయిన తరువాత యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ కొరియాను రెండుగా విభజించబడింది. కొరియా తిరిగి సైఖ్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1948లో రెండు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తర భాగంలో ది డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ ప్రాంతంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా.
Next

No comments:

Post a Comment