బొగ్గు తవ్వకాల నియంత్రణకు సుస్థిర అభివృద్ధి విభాగం

పర్యావరణ విధమైన మరియు స్థిరమైన బొగ్గు తవ్వకాల కొరకు సుస్థిరాభివృద్ధి విభాగాన్ని( sustainable development Cell) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  
*బొగ్గు తవ్వకాలను చేపడుతున్న అప్పుడు జరిగే పర్యావరణ హాని తగ్గించడం కొరకు ఈ విభాగం పని చేయవలసి ఉంటుంది.  బొగ్గు తవ్వకాలు పర్యవేక్షించడం, సలహాలు అందించడం, ప్రణాళిక రూపొందించి అమలుపరచడం, బొగ్గు గనుల దగ్గరలో ఉండే ప్రజలకు హానికరం కాని వాతావరణాన్ని అందించేలా చేయడం ఈ విభాగం యొక్క బాధ్యతలు.
* ఈ విభాగం మైనింగ్ యొక్క చెడు ప్రభావాలను తగ్గించడంలో మోడల్ పాయింట్ గా పనిచేస్తుంది.  భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యావరణం పై మైనింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. 
* అలాగే సుస్థిరమైన గనుల పర్యాటకం, గనుల నీటి నిర్వహణ,గాలి నాణ్యత వంటి అంశాలపై కూడా ఈ విభాగం దృష్టి పెడుతోంది. 
*మైన్ క్లోజర్ ఫండ్ రూపొందించి నిర్వహిస్తుంది. 
*భారతదేశంలో 2,550  చదరపు కిలోమీటర్లభూమిలో బొగ్గు గనులు ఉన్నాయి. 
*చెట్లను తొలగించడం ద్వారా ఏయే ప్రాంతాల్లో గనుల తవ్వకం చేపట్టవచ్చు అనే అంశాల్ని ఈ విభాగం పరిశీలిస్తుంది. 
* గనుల తవ్వకాల వల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, కర్బన ఉద్గారాల విషయంలో చేపట్టవలసిన చర్యలను సూచిస్తుంది. 
*చెత్తను  రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు పొందవచ్చో ఈ విభాగం సూచిస్తుంది. 
*మైన్ క్లోజర్ నియమాలను బొగ్గు మంత్రిత్వ శాఖ 2112 సంవత్సరంలో విడుదల చేసింది. 
*మైనింగ్ చేపట్టేవారు గనుల తవ్వకాలను నిలిపి వేసినప్పుడు దానికి సరైన కారణాన్ని సూచించదు వలసి ఉంటుంది. డిమాండ్ లేకపోవడం లేదా వనరుల పెరుగుదల, నష్టాలు సంభవించ డం వంటి కారణాలను సూచించాల్సి ఉంటుంది.
NEXT

No comments:

Post a Comment