ముషారఫ్ కు ఉరి శిక్ష విధించిన లాహోర్ కోర్టు

*పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ లాహోర్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
*దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదైంది.
*ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది.
* మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాక్‌ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా 1979లో ఉరి తీశారు.
*ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా 2007 నవంబర్‌ 3న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 
* ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బంధించారు. 
*అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. 
*కేసు విచారణ జరుగుతుండగానే 2016లో దేశం విడిచి వెళ్లిపోయారు. 
*పర్వేజ్ ముషారఫ్‌ గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. 
* నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ -PML ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.
NEXT

No comments:

Post a Comment