బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

*బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను డిసెంబర్ 17వ తేదీన విజయవంతంగా పరీక్షించారు. 
*డీఆర్‌డీవో ఈ పరీక్ష చేపట్టింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని పరీక్షించారు. 
*బ్రహ్మోస్ మిస్సైల్‌తో అడ్వాన్స్‌డ్ ఇండీజీనిస్ సీకర్‌ను కూడా ప్రయోగించారు. సముద్రంలో ఉన్న ఓ నౌకను టార్గెట్ చేస్తూ మిస్సైల్‌ను పరీక్షించారు.
*చండీపూర్‌లోని మూడవ ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్ నుంచి ఈ పరీక్ష కొనసాగింది. ఈ మిస్సైల్‌ను డీఆర్‌డీవో, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థలు డిజైన్ చేశాయి.
*90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ మిస్పైల్ పేల్చేస్తుంది. సుమారు 200 కిలోల బరువున్న వార్‌హెడ్స్‌ను ఇది మోసుకువెళ్లగలదు.
*భూతలం నుండి భూతలానికి జరిపిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది.
* బ్రహ్మోస్ మధ్య శ్రేణి మిస్సైల్‌ను సబ్‌మెరైన్లు, నౌకలు, ఫైటర్ జెట్లతో పాటు భూమి మీద నుంచి కూడా ఫైర్ చేయవచ్చు. 
*ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇదే లాంచింగ్ సైట్‌లో క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించారు. 
* భారత్‌, రష్యా సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ మిస్సైల్‌కు చెందిన అప్‌గ్రేడ్ వర్షన్ సుమారు 500 మైళ్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు.
*తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు రూపొందించబడ్డ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం 2019 సెప్టెంబర్ 30వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం జరిగింది.
*ఈ క్షిపణులను త్రివిధ దళాలు అయిన భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు వినియోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణిగా బ్రహ్మోస్ క్షిపణి గుర్తింపు పొందింది. 
*భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించడం, గాల్లో ఉన్న లక్ష్యాలను చేధించడం వీటి ప్రత్యేకత
NEXT

No comments:

Post a Comment