ఆదాయాల పెంపుకు జీఎస్టీ సవరణ

*వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్‌టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 
* డిసెంబర్‌ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. 
*ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.  
* ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి.
*28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్‌ వసూలు చేస్తున్నారు. 
*అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలిస్తున్నారు. 
*కొన్ని వస్తువులపై భారీగా సెస్‌ విధించే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించే అవకాశం ఉంది. 
*2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాలకంటే 40శాతానికి తగ్గాయి.  
*ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు గత ఐదు నెలల నుంచి వారికి వాటా వారి ఇవ్వడం లేదు. 
*కొన్ని వస్తువులకి జిఎస్టి కి తోడుగా సెస్ కూడా విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిని వస్తువుల అసలు ధర కన్నా జిఎస్టి రేట్ ఎక్కువ ఉండేలా కమిటీ సిఫార్సు చేసింది. 
* ప్రస్తుతం జిఎస్టి లో ఉన్న 5 శాతం శ్లాబ్ 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15 శాతానికి పెంచే అవకాశం ఉంది. 

11th December 2019 Current Affairs In Telugu

No comments:

Post a Comment