భారత నైపుణ్య నివేదిక

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ,ఆల్ ఇండియా  కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్,యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సంయుక్తంగా భారత నైపుణ్య నివేదికను రూపొందించాయి. 
*ఈ నివేదిక దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజల ఉద్యోగ సామర్థ్యం( employability) అంచనా వేసి, రాష్ట్రాలు మరియు నగరాల ఆధారంగా బ్యాంకులు కేటాయించింది. 
* 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 35 విద్యాసంస్థల 300,000 మంది విద్యార్థుల మీద సర్వే నిర్వహించింది. 
* ఉద్యోగ సామర్థ్యం అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది ఉన్నత ఉద్యోగం సామర్థ్య కలిగి ఉన్నారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రెండు మరియు మూడవ స్థానంలో ఉన్నాయి.
*నగరాల పరంగా చూస్తే మొదటి స్థానంలో ముంబై, రెండవ స్థానంలో హైదరాబాద్,  మూడవ స్థానంలో పూణే ఉన్నాయి. 
*వృత్తిపరంగా చూసినట్లయితే,ఎంబీఏ చదివిన వారు అత్యంత ఉద్యోగ సామర్థ్యాన్ని 54% స్కోర్ తో కలిగి ఉన్నారు. 
* 2018 సంవత్సరంలో మొదటి స్థానంలో ఇంజనీర్లు ఉన్నారు. ఎంబీఏ తర్వాత ఫార్మసీ, కామర్స్, ఆర్ట్స్ చదివిన వారు రెండు,మూడు,నాలుగు స్థానాల్లో వరుసగా ఉన్నారు. 
*ఉద్యోగ సామర్థ్యంలో పురుషులు 46 శాతం స్కోర్,మహిళలు 47 %స్కోర్ కలిగి ఉన్నారు. 2018 సంవత్సరంలో 48% మరియు 46 %శాతంగా ఉండింది. 
* దీని ప్రకారం పురుషుల కంటే మహిళలు అత్యధిక ఉద్యోగం సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. 
* దేశవ్యాప్తంగా ఉద్యోగ సామర్ధ్య రేటు 46 %

No comments:

Post a Comment