కిసాన్ సమ్మాన్ నిధులు పొందటానికి ఆధార్‌ అనుసంధానం

*రైతులకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు పొందటానికి బ్యాంక్ ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. 
*ప్రతి ఏడాది విడతల వారీగా మొత్తం రూ.6,000 మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది. దీనిని పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. 
*ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించలేదు. 
*నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి అనే అంశాన్ని తీసుకువచ్చారు.
*ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతాలకే నాలుగో విడత కిసాన్ సమ్మాన్ సొమ్ములభించనుంది,ఈసారి దాదాపు రూ. 10వేల కోట్లను ఒకేరోజు అందజేసే అవకాశం ఉంది.
*ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం(పీఎం కిసాన్) కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6వేల మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
* దీనిని మొత్తం 4 వాయిదాల్లో రైతులకు చెల్లిస్తోంది. 2019-2020 మార్చిలోపు ఈ వాయిదాలను రైతులకు బదిలీ చేయాల్సి ఉంది.
*2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు.
*చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది.
*2019 - 20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 75,000 కోట్ల వార్షిక వ్యయం కాగల ఈ పథకానికి అయ్యే పూర్తి ఖర్చు భారత ప్రభుత్వం భరిస్తుంది.

No comments:

Post a Comment