తెలంగాణలో 6 కొత్త విమానాశ్రయాలు

*తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఏకైక విమానాశ్రయం శంషాబాద్‌లోని ఆర్‌జీఐఏ అంతర్జాతీయ విమానాశ్రయం.బేగంపేట ఎయిర్‌పోర్టులో కమర్షియల్‌ విమానాలకు అనుమతి లేకపోవడంతో తెలంగాణ మొత్తానికి ఒకే ఒక విమానాశ్రయం ఉన్నట్టు అయ్యింది.
* విదేశాల నుంచి వచ్చేవారు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే.. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి, ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెళ్ళవలసి ఉంటుంది.
* ఇందుకోసం ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు ఉండాల్సిన అర్హతలు, ఇతర సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది.
*ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 విమానాశ్రయాలపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఏరియల్ సర్వే నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఈ సర్వే త్వరలో నిర్వహించాలని నిర్ణయించింది.
*ఏరియల్ సర్వేలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తారు. 
* రిమోట్‌ సెన్సింగ్‌ జీఐఎస్‌ మ్యాపింగ్‌, నియంత్రణ వంటి సమాచారాన్ని సేకరిస్తారు.
*నేల స్వభావాన్ని కూడా అంచనా వేస్తారు. రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, ప్రతిపాదిత విమానాశ్రయ స్థలానికి చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రయాణికుల సౌలభ్యం, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తెలంగాణలో ఆరు ప్రాంతాలను గుర్తించారు. 
*నిజామాబాద్‌, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
* ఈ జిల్లాల్లోనూ నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అద్దకల్‌, భద్రాద్రి కొత్తగూడెం వద్ద, వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. 
*నిజామాబాద్‌ నగరంలో గతంలో విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు జక్రాన్‌ పల్లిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. 
* విమానాశ్రయాల అనుమతుల కోసం ఇప్పుడు జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది.
NEXT

No comments:

Post a Comment