నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం నవంబర్ 6న ప్రకటించింది.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- మొండి బకాయిలు (ఎన్పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఏఐఎఫ్ నిధిని పొందేందుకు అర్హమైనవి.
- - రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ అందిస్తాయి.
- - నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఏఐఎఫ్ తోడ్పడుతుంది.
- రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుంది.
No comments:
Post a Comment