ఏపీలో వైఎస్సార్ వాహనమిత్ర ప్రారంభం

ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4న ప్రారంభించారు.
Current Affairsపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘2018 మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని అమలు చేశాం. వారి కష్టాలను స్వయంగా చూసి ఈ పథకాన్ని రూపొందించాం’ అని తెలిపారు. వాహనమిత్ర ద్వారా 1,73,531 మందికి లబ్ధి చేకూరనుంది.

మరోవైపు ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే 2019, అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే వైఎస్సార్ కంటి వెలుగు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

No comments:

Post a Comment