ఏపీలో సచివాలయ వ్యవస్థ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభమైంది.
Current Affairsమహాత్మ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప మండల కేంద్రంలో అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. విధులు, బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.

సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు 
  • జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం.
  • పరిపాలనలో అవినీతి, వివక్షకు తావులేకుండా చేయడానికే ఈ గ్రామ సచివాలయాలు.
  • ప్రతి 2,000 జనాభాకు 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులను కొత్తగా నియమించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం.
  • గ్రామ సచివాయాల్లో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1వ తేదీకల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • గ్రామ సచివాలయం పక్కనే గ్రామ సచివాలయం పక్కనే ఒక దుకాణం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే రైతుల కోసం ఒక వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేస్తాం.
  • ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారుస్తాం. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) మండల స్థాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ మార్పు తీసుకురావాలి.
  • రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33 శాతం మంది ఉన్నారు. అందరూ అక్షరాస్యులు కావాలి.
  • మహాత్మాగాంధీని స్ఫూర్తిని తీసుకుని ఏ గ్రామంలోనూ మద్యం బెల్టుషాపులు లేకుండా రద్దు చేశాం. మద్యం నియంత్రణకు కృషి చేస్తాం.
  • పేదలకు దాదాపుగా ఉగాది నాటికల్లా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం.
  • ఒకసారి వినియోగించి వదిలేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను విడిచిపెట్టి జ్యూట్, క్లాత్‌తో తయారయ్యే సంచులను వాడుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

No comments:

Post a Comment