Indian Economy Questions In Telugu

1.'సప్లయ్..... తన డిమాండును తానే సృష్టించుకుంటుంది' అని పేర్కొన్నది ఎవరు ?
Ans. జె.బి .సే
2. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 'రోలింగ్ ప్రణాళిక' ను ప్రతిపాదించిన తొలి ఆర్థికవేత్త ఎవరు ?
Ans. జి.మిర్దాల్
3. కేంద్ర ప్రణాళికను రూపొందించినప్పుడు ప్రణాళికా సంఘం ఆర్ధిక వ్యవస్థలోని ప్రతి రంగానికి లక్ష్యాలు, ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ఈ ప్రణాళికా వ్యవస్థను ఏమని పిలుస్తారు ?
Ans. కేంద్రీకృత వ్యవస్థ
4. 'హిందూ వృద్ధి రేటు' అనే భావనను సూచించిన వారెవరు ?
Ans. రాజకృష్ణ
5. మానవాభివృద్ధి సూచీని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరం నుంచి ఉపయోగిస్తారు ?
Ans. 1990
6. పన్ను విధించే మొత్తంలో సంభంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉండటాన్ని ఏమని పిలుస్తారు ?
Ans.అనుపాత పన్ను
7. భారత్ లో మొదటగా ఏర్పాటు చేసిన స్టాక్ ఎక్స్చేంజ్ ఏది ?
Ans. బొంబాయి
8. 'వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్'ను ప్రచురించే సంస్థ ఏది ?
Ans. అంతర్జాతీయ ద్రవ్య నిధి
9. 'భారత ప్రణాళికల పితామహుడు' అని ఎవరిని పేర్కొంటారు ?
Ans. ఎం. విశ్వేశ్వరయ్య
10. నల్లధనాన్ని నిర్ములించడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి నియమించిన కమిటీ ఏది ?
Ans. వాంచూ కమిటీ
11. మన దేశంలో దరిద్రరేఖను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం ఏది ?
Ans. తలసరి ఆదాయం
12. భారత్ లో సహకార సంఘాలను ఎప్పుడు ప్రారంభించారు ?
Ans. 1904
13. 'అల్పాభివృద్ది దేశాల ఆర్థికాభివృద్ధి కోసం సంతులిత వృద్ధి అవసరం' అని ప్రస్తావించింది ఎవరు ?
Ans. రగ్నార్ నర్క్స్
14. అంతర్జాతీయ వ్యాపారానికి 'వాచ్ డాగ్ 'గా ఏ సంస్థ పనిచేస్తుంది ?
Ans. ప్రపంచ వాణిజ్య సంస్థ
15. మన దేశంలో "CAPART" అనే వ్యవస్థను కింది వాటిలో దేన్నీ ఉద్దేశించి రూపొందించారు ?
Ans. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పేదరికాన్ని తగ్గించడం

No comments:

Post a Comment